Ad Code

భారీగా తగ్గిన టూవీలర్ల అమ్మకాలు



పెరిగిన టూవీలర్ల ధర, అధిక పెట్రోలు ధరలు, ఇతర కారణాల వల్ల దేశంలో బైక్స్ అమ్మకాలు బాగా తగ్గుతూ వస్తున్నాయి. చిప్ ల కొరత కారణంగా బైక్స్ తో పాటు కార్ల వంటి వాహనాల ఉత్పత్తి కూడా తగ్గుతోంది. దీనివల్ల ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి. కేవలం ఒక్క మార్చిలోనే వాహనాల అమ్మకాల్లో 4% వరకు క్షీణత కనిపించడం గమనార్హం. ఈ నెలలో 2,79,501 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. వీటిలో టూవీలర్ల సేల్స్ చాలా తక్కువగా నమోదయ్యాయి. వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్గనైజేషన్ సియామ్ ఈ గణాంకాలను బయటపెట్టింది.  మార్చి నెలలో టూవీలర్ల అమ్మకాల్లో ఏకంగా 21% తగ్గుదల నమోదైంది. ఈ నెలలో టూవీలర్ల సేల్స్ 11,84,210 యూనిట్లుగా ఉండగా... ఇది 10 ఏళ్ల కనిష్ఠ స్థాయి అని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. 2021లో ఇదే నెలలో 14,96,806 టూవీలర్ యూనిట్ల విక్రయాలు జరిగాయి. అంటే ఏ స్థాయిలో వీటి సేల్స్ పడిపోయాయో గమనించవచ్చు. ఇక పేదవారికి ప్రియమైన సైకిళ్ల సేల్స్ ఏకంగా 21 శాతం క్షీణించాయి. వీటి అమ్మకాల పతనానికి ప్రధాన కారణాలలో ఒకటి ఇంధన ధరల పెరుగుదల. దేశంలో ఎప్పటికప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇది ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిళ్ల డిమాండ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. కొత్త మోటార్‌సైకిల్ విక్రయాలు నేరుగా ఇంధన ధరలతో పరస్పర సంబంధం కలిగి ఉంటాయి, ఎందుకంటే దేశంలోని ఇంధన విక్రయాలలో 62% టూవీలర్ల ఓనర్లే కొనుగోలు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu