Ad Code

ఆంద్రప్రదేశ్ లో మరో రెండు రివోల్ట్ మోటార్స్ షోరూమ్ లు !


ఆంద్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ రివోల్ట్ మోటార్స్ మరో రెండు కొత్త షోరూమ్ లను స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది. నెల్లూరు, విజయవాడ నగరాల్లో  తమ కొత్త షోరూమ్ లను ఏర్పాటు చేసింది. రివోల్ట్ మోటార్స్‌కు వైజాగ్ తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్‌లో మూడవ స్టోర్ అవుతుంది. రివోల్ట్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు భారతదేశంలో ఈ బ్రాండ్ ఇప్పటికే 22 షోరూమ్ లను రెడీ చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి కంపెనీ తమ షోరూమ్‌ల సంఖ్యను 40కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించిన ప్రతి అంశానికి సపోర్ట్ ఇచ్చే మూడవ అత్యంత ఈవీ-ఫ్రెండ్లీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కంపెనీ పేర్కొంది.  ఈవీల స్వీకరణను వేగవంతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం నిర్వహించే ఈవీ విధానాలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడం ఇంకా అలాగే తయారీని ప్రోత్సహిస్తున్నాయి. అలాగే కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం రోడ్డు టాక్స్ మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు వివిధ రకాల రాయితీలను కూడా అందిస్తుంది.  అంతేకాకుండా, 2030 సంవత్సరం నాటికి సిటీ బస్సుల విషయంలో 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  అలాగే రాష్ట్రంలో ఈవీల తయారీ కోసం 30,000 కోట్ల రూపాయల పెట్టుబడిని కూడా వెచ్చించాలని కూడా ప్లాన్ చేస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu