రూ.99కే 28రోజుల వ్యాలిడిటీతో పాటు డేటా, కాల్, ఎస్ఎమ్ఎస్ సౌకర్యం అందించే స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ ను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. కొత్త ‘స్మార్ట్ రీఛార్జ్’ ప్లాన్తో ఎయిర్టెల్ సిమ్లను సెకండరీ సిమ్గా ఉపయోగించాలనుకున్నా యాక్టివ్గానే ఉంచుకోవచ్చు. ఎయిర్టెల్ సిమ్ను సెకండరీ సిమ్గా ఉపయోగిస్తున్న వారికి, దానిని ఎక్కువగా ఉపయోగించకుండా ఎక్కువ కాలం యాక్టివ్గా ఉండాలని కోరుకునే వారికి ఈ ప్లాన్ దోహదపడుతుంది.ఈ సరసమైన ప్లాన్ సెకండరీ సిమ్ వినియోగదారుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. తక్కువ బడ్జెట్ ప్లాన్ కోసం చూస్తున్న వ్యక్తులు కూడా ఈ ప్లాన్ను ఉపయోగించవచ్చు. రూ.99 ప్రీపెయిడ్ ప్లాన్ 200MB డేటా, రూ.99 విలువైన టాక్-టైమ్, సెకనుకు 1 పైసా వసూలు చేసే లోకల్ టారిఫ్ కాల్లను అందిస్తుంది. SMS స్థానికంగా ఉంటే దాదాపు రూ. 1 ఖర్చవుతుంది. STD SMS కోసం, Airtel రూ. 1.5/మెసేజ్ వసూలు చేస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల పాటు యాక్టివ్గా ఉంటుంది. ఇంతకుముందు, ఎయిర్టెల్ నుండి అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్ రూ. 79, అయితే నవంబర్ 2021లో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ టారిఫ్లను పెంచినప్పుడు, కంపెనీ అదే ప్లాన్ ధరను రూ.79 ప్లాన్ నుండి రూ.99కి మార్చింది.
0 Comments