Ad Code

ఇస్రోపై మాధవన్ వ్యాఖ్యలకు నెటిజన్ల ఆగ్రహం !


"ఇస్రో చేపట్టిన అంగారక యాత్రకు పంచాంగం తోడ్పడింది. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించగలిగింది. గ్రహగతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయి" అని నటుడు మాధవన్ వ్యాఖ్యలు చేశాడు. మాధవన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. 'సైన్స్ గురించి తెలియకపోవడం తప్పేమీ కాదు. మాధవన్ చెత్తవాగుడును కట్టిపెట్టాలి. వాస్తవాలు తెలియకుండా మాధవన్ మాట్లాడిన మాటలు వింటుంటే ఓ మూర్ఖుడిలా అనిపించాడు. మాధవన్ ఇకపై అధికారికంగా చాక్లెట్ బాయ్ నుంచి వాట్సాప్ అంకుల్ అయ్యాడు. మాధవన్ మాట్లాడకుండా ఉంటేనే ముద్దొస్తుంటాడు' అని కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu