శక్తివంతమైన సౌర తుపాను భూమిని తాకబోతోందని నాసా ప్రకటించింది. దాని ప్రభావంతో సెల్ఫోన్ సిగ్నళ్లు, జీపీఎస్ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశముందని పేర్కొంది. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందని, ఎప్పుడైనా భూ గ్రహాన్ని తాకవచ్చని హెచ్చరించారు. తొలుత నిన్న తాకుందని అంచనా వేసినా, ఆ తర్వాత ఇవాళ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని నిర్దారించారు. దీనివల్ల ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లోని ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడగలరని తెలిపారు. సౌర తుపాను ప్రభావంతో భూగోళపు బాహ్య వాతావరణం వేడెక్కే అవకాశముందని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ప్రభావం ఉపగ్రహాలపై పడి జీపీఎస్ నేవిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ప్రమాదం వుందని హెచ్చరించారు.
0 Comments