పెట్రోల్ కార్ల తయారీని నిలిపివేయనున్న మారుతీ సుజుకి ?
Your Responsive Ads code (Google Ads)

పెట్రోల్ కార్ల తయారీని నిలిపివేయనున్న మారుతీ సుజుకి ?


దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి వచ్చే 7 నుంచి 10 ఏండ్లలో పెట్రోల్ వినియోగ కార్ల తయారీని పూర్తిగా నిలిపేస్తామని ప్రకటించింది. అలాగే ఆటో మేజర్ ప్రస్తుత ప్లాన్ ప్రకారం వచ్చే 7-10 ఏండ్లలో హైబ్రీడ్‌, ఫ్లెక్స్ ఫ్యూయల్‌, బయో ఫ్యూయల్‌ ఇంకా అలాగే ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనున్నది. బీఎస్‌-6 కర్బన ఉద్గారాల ప్రమాణాలు అమల్లోకి తేవడంతో 2020 ఏప్రిల్ నుంచే డీజిల్ వినియోగ కార్లు అలాగే వాహనాల తయారీ నిలిపేసింది. అయితే వచ్చే మూడేండ్లలోపు అంటే 2025 వ సంవత్సరం నాటికి గానీ పూర్తి స్థాయిలో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను లాంచ్ చేయలేమని కూడా మారుతి సుజుకి కంపెనీ తేల్చేసింది.ఇంకా అలాగే తాము పలు పర్యావరణ అనుకూల టెక్నాలజీతో పనులు ప్రారంభించాం అని మారుతి సుజుకి ఇండియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీవీ రామన్ చెప్పారు. అలాగే వచ్చే దశాబ్దకాలంలో అన్ని వాహనాలను ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ వాహనాలుగా కన్వర్ట్ చేస్తామన్నారు. ఇక ఆపై పూర్తి పెట్రోల్ వినియోగ వాహనాలు ఉండవని కూడా తెలిపారు. అంటే ఇక అవి విద్యుత్ వాహనాలైనా లేదా సీఎన్జీ లేదా బయో ఫ్యూయల్ వాహనాలైనా కానీ ఉండొచ్చునని సీవీ రామన్ పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Search This Blog