శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్పై అదిరే డీల్ సొంతం చేసుకోవచ్చు. కంపెనీ వెబ్సైట్లో ఎంఆర్పీ రూ. 34,999గా ఉంది. అయితే దీన్ని రూ. 11 వేల డిస్కౌంట్ తో రూ. 23,999కు కొనొచ్చు. మరో ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 2 వేల వరకు క్యాష్బ్యాక్ వస్తుంది. అంటే మీకు మొత్తంగా శాంసంగ్ 5జీ ఫోన్పై ఏకంగా రూ. 13 వేల డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డిమెన్సిటీ 900 ప్రాసెసర్, 108 ఎంపీ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్, వాపౌర్ కూలింగ్ చాంబర్, ఆటో డేటా స్విచ్చింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్పై వన్ యూఐ 4పై పని చేస్తుంది. డాల్బే ఆటమ్స్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ స్లిమ్గా (7.4 ఎంఎం) ఉంటుంది. సైడ్ ఫింగర్ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ నెలకు రూ. 4 వేల నుంచి ప్రారంభం అవుతోంది. క్రెడిట్ కార్డు ఉంటే ఈఎంఐ ఆప్షన్ పెట్టుకోవచ్చు. 18 నెలల ఈఎంఐకు నెలకు రూ. 1375 చెల్లించాలి. కాగా ఇక్కడ ఈఎంఐ అమౌంట్ అనేది మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మారుతుంది. ఎక్కువ టెన్యూర్ ఎంచుకుంటే తక్కువ ఈఎంఐ పడుతుంది. తక్కువ టెన్యూర్ అయితే ఎక్కువ ఈఎంఐ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది.
0 Comments