ఫ్లిప్ కార్ట్ దీవాళీ సేల్ ను మరో సారి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు సేల్ నిర్వహించిన ఫ్లిప్ కార్ట్, మూడు రోజుల వ్యవధిలోనే మరో సారి దీపావళి సేల్ ను ప్రారంభించింది. అక్టోబర్ 19న ప్రారంభమైన ఈ సేల్ 23వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో కనీవినీ ఎరగని ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లపై 50 శాతానికి పైగా డిస్కౌంట్లు అందిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు సైతం వర్తించనున్నాయి. తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తే ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దీపావళి సేల్ లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.10 వేల ధరలోనే బెస్ట్ స్మార్ట్ టీవీని ఈ సేల్ లో సొంతం చేసుకోవచ్చు. realme 80 cm HD Ready LED Smart Android TV పై ఈ సేల్ లో మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ టీవీ అసలు ధర రూ.17,999 కాగా, ఈ దీనిపై 38 శాతం డిస్కౌంట్ దీపావళి సేల్ లో అందుబాటులో ఉంది. రూ.7 వేల తగ్గింపుతో రూ.10,999కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపును అందుకోవచ్చు. టీవీపై ఎక్సేంజ్ ఆఫర్ సైతం ఉంది. మీ పాత టీవీని ఎక్సేంజ్ చేస్తే రూ.9 వేల వరకు తగ్గింపు అందుకోవచ్చు. పాత టీవీ మోడల్, కండిషన్ పై మీకు లభించే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. ఈ టీవీ Netflix, Prime Video, Disney+Hotstar, Youtube తదితర యాప్ లను ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ స్మార్ట్ టీవీ పని చేస్తుంది.
0 Comments