Ad Code

ఒకేసారి మూడు డివైజ్‌లకు చార్జింగ్ !


ఒకేసారి మూడు గ్యాడ్జెట్స్‌ చార్జ్‌ చేసుకునేందుకు వీలుగా రీగర్‌ మాగ్‌ఫిక్స్‌ ట్రయో వచ్చేసింది \. దీంతో ఒకేసారి ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌, ఇయర్‌బడ్స్‌ చార్జ్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ పరికరాల వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ వాచీలు, బ్లూటూత్‌ పరికరాలు.. ఎటుచూసినా సాంకేతికతే. వీటిని వాడటం సులభమే కానీ చార్జింగ్‌ కష్టం. అయితే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఒకేసారి మూడు గ్యాడ్జెట్స్‌ చార్జ్‌ చేసుకునేందుకు వీలుగా వచ్చేసిందే.. రీగర్‌ మాగ్‌ఫిక్స్‌ ట్రయో. దీంతో ఒకేసారి ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌, ఇయర్‌బడ్స్‌ చార్జ్‌ చేసుకోవచ్చు. కాకపోతే స్టాండ్‌ను ముందే చార్జ్‌ చేసి పెట్టుకోవాలి. స్మార్ట్‌ ప్యాడ్‌లోని అయస్కాంతాలు గ్యాడ్జెట్స్‌ కిందపడకుండా పట్టి ఉంచుతాయి. దీన్ని ప్రత్యేకించి యాపిల్‌ పరికరాల కోసమే తయారుచేశారు. దాదాపు పన్నెండు ఫోన్లను చార్జ్‌ చేయగల సామర్థ్యం ఉంది. ధర రూ. 4,499. 

Post a Comment

0 Comments

Close Menu