Ad Code

ఎలక్ట్రిక్‌ వాహనం రూ.35 వేలే !


పంజాబ్ కు చెందిన నౌషా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొత్త ఈవీని రూపొందించింది. దీని ధర కేవలం రూ. 35 వేలు మాత్రమే. తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్‌ అనే చెప్పాలి. ఈ స్కూటర్‌ తయారీలో వ్యవసాయ బోర్లలో ఉపయోగించే సబ్‌మెర్సిబుల్ బోర్‌వెల్ మోటారును ఉపయోగించారు. పైన భాగాన్ని తీసేసి లోపలి భాగాన్ని ఈ స్కూటర్‌కు వాడారు. హబ్ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్ వంటివి కూడా ఇతర ఈవీల నుంచి తీసుకున్నారు. తాము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా స్క్రాప్ మెటీరియల్స్‌తో తయారు చేశానని, వీటిని గతంలో వాడేందుకు అనర్హమైనదిగా భావించినట్లు నౌషా పేర్కొంది. అయితే కొన్ని స్క్రాప్ మెటీరియల్‌ని ఎంపిక చేసి ఈ స్కూటర్‌కు ఉపయోగించినట్లు నౌషా తెలిపింది. అయితే నౌషా ఎలక్ట్రిక్‌ స్కూటర్ అనేది కంపెనీ కాదు. ఈవీ వాహనాలకు సంబంధించి విడి భాగాలను దిగుమతి చేసుకుని స్కూటర్‌ను తయారు చేస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారు చేయడానికి మొదట రూ.40 వేల వరకు ఖర్చు అయిందట. తర్వాత దీనిని రూ.35కే తయారు చేశారు. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ స్కూటర్‌కు ఆర్డర్లు వచ్చాయని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వాహనం కొనుగోలు చేసేందుకు అందుబాటులో లేకపోయినా. త్వరలో అమ్మకాలు ప్రారంభం అయ్యే అవకాశాలు న్నాయి. ఈ స్కూటర్‌ బ్లాక్‌, ఎల్లో రంగుల్లో లభించనున్నాయి. ఎల్లో రంగు వాహనం ముందు భాగంలో డ్రమ్‌ బ్రేక్స్‌ ఉండగా, బ్లాక్‌ వేరియంట్‌లో ఉండవని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu