Ad Code

రూ.1,337 కోట్ల పెనాల్టీ !


దేశంలో గూగుల్ చేస్తున్న అనైతిక వ్యాపార కార్యకలాపాల కారణంగా వ్యాపార పర్యవేక్షణ సంస్థ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గూగుల్‌పై రూ.1,337 కోట్ల జరిమానా విధించింది. గూగుల్ ఈ జరిమానాపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ లో అప్పీల్ దాఖలు చేయలేదు. సీసీఐ ద్వారా జరిమానా విధించిన తర్వాత 60 రోజులలోపు ఎన్‌సీఎల్‌ఏటీలో తమ అప్పీల్‌ను దాఖలు చేసే హక్కు కంపెనీలకు ఉంది. కానీ గూగుల్‌e అలా చేయలేదు. అక్టోబర్ 25న అనైతిక వ్యాపారం చేస్తున్నందుకు గూగుల్‌పై జరిమానా విధించాలని సీసీఐ నిర్ణయించిందిన. దీనిని డిసెంబర్ 25 వరకు ఎన్‌సీఎల్‌ఏటీలో అప్పీల్‌కు అవకాశం ఉండేది. ఈ కేసులో రూ.1,337 కోట్ల పెనాల్టీ కోసం గూగుల్ ఎలాంటి అప్పీల్ చేయలేదు. దీంతో పాటు పెనాల్టీ డబ్బులు కూడా జమ చేయలేదు. అటువంటి పరిస్థితిలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా త్వరలో గూగుల్‌పై చర్యను ప్రారంభించి, రూ. 1,337 కోట్ల రికవరీ కోసం డిమాండ్ లేఖను పంపనుంది. దీని తర్వాత గూగుల్‌పై మరో రూ.937 కోట్ల జరిమానా విధించారు. ఇప్పుడు ఈ విషయంలో సీసీఐ ముందుగా గూగుల్‌కి డిమాండ్ లేఖను పంపనుంది. దీని తర్వాత కంపెనీ జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ అలా చేయని పక్షంలో కంపెనీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులను అటాచ్ చేయాల్సి ఉంటుంది. దీంతో చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గత వారం సమాచారం ఇస్తూ సీసీఐ విధించిన పెనాల్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మేము అప్పీల్ చేయబోతున్నామని గూగుల్‌ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu