జీబ్రానిక్స్ జీబ్ పిక్సాప్లే 17 పేరుతో కొత్త స్మార్ట్ ప్రాజెక్టర్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ప్రొజెక్టర్ తో ఇంట్లోనే సినిమా హాల్ ఫీలింగ్ ని పొందవచ్చు. 224 అంగుళాల స్క్రీన్ పై సినిమాలు చూడవచ్చు. ఈ ప్రొజెక్టర్ 6000 లుమెన్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఫీచర్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ ధర రూ. 24,999. అయితే బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే రూ. 24 వేలకే ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ పొందవచ్చు. ఈ ప్రొజెక్టర్ లో ఆటో ఫోకస్, కీస్టోన్ అడాప్షన్, డాల్బే ఆడియో సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.అలాగే బిల్ట్ ఇన్ పవర్ఫుల్ స్పీకర్లు ఉన్నాయి. అలాగే డ్యూయెల్ హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, ఏయూఎక్స్ ఔట్పుట్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి. 30 వేల గంటల పాటు ప్రొజెక్టర్ ల్యాంప్ పని చేస్తుంది. స్మార్ట్ ఫోన్ నుంచి మీరాకాస్ట్ ఫీచర్తో ఈ ప్రొజెక్టర్పై నచ్చిన సినిమాలు చూడవచ్చు. ఈ ప్రొజెక్టర్ లో బిల్ట్ ఇన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. 32 జీబీ రామ్. యాప్ డౌన్లోడ్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్, రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఉంది. అలాగే అదనపు స్పీకర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్యూయెల్ బాండ్ వైఫై ఉంది. బ్లూటూత్ 5.1 ఫీచర్ కూడా ఉంది. అంటే స్పీకర్లను ఈజీగానే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రొజెక్టర్ కొనే వారికి హ్యాండీ బ్యాక్ప్యాక్ కూడా లభిస్తుంది. దీని ద్వారా మీరు ప్రొజెక్టర్ను స్టోర్ చేసుకోవచ్చు.
0 Comments