Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, December 13, 2022

మిస్డ్ కాల్ తో రూ. 50 లక్షలు గోవిందా !


దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి సైబర్ మోసం కారణంగా రూ.50 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం, బాధితుడికి కొన్ని రోజుల క్రితం రాత్రి 7 నుంచి 8.45 గంటల మధ్య అతని సెల్ ఫోన్‌లలో వరుసగామిస్డ్ కాల్స్ వచ్చాయి. అతడు కొన్ని కాల్స్ మాత్రం పట్టించుకోలేదు. చివరికి అతడు ఒక మిస్డ్ కాల్ ఎత్తాడు. అప్పుడు అవతలి వైపు నుంచి ఎవరూ మాట్లాడలేదు. కొంత సమయం తర్వాత బాధితుడి ఫోన్‌కు వరుసగా మెసేజ్ లు వచ్చాయి. తన మొబైల్ ఫోన్‌ను చెక్ చేయగానే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ మెసేజ్ రావడం చూసి షాక్ అయ్యాడు. అంటే.. దాదాపు రూ. 50 లక్షల వరకు రియల్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా నగదు బదిలీ జరిగినట్టు గుర్తించాడు. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై పోలీసు కేసు నమోదైంది. ఈ కేసు జార్ఖండ్‌లోని జమ్తారాలో ఆధారితమై ఉండవచ్చునని ప్రాథమిక దర్యాప్తు అనుమానిస్తోంది. బాధితుడి అకౌంట్లో మోసపూరితంగా నగదును బదిలీ చేసిన వ్యక్తి కమీషన్ కోసం మోసగాళ్లకు వారి అకౌంట్లను అద్దెకు ఇచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. జమ్తారా స్కామ్ సాధారణంగా సైబర్ మోసాలతో ముడిపడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. జమ్తారా నగరంలో మోసగాళ్లు బ్యాంకు అకౌంట్ల నంబర్లు, పాస్‌వర్డ్‌లు, OTP, డబ్బు లావాదేవీలు చేసేందుకు స్క్రీన్-మిర్రరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని బాధితులను నమ్మిస్తారు. ఇటీవలి కేసులో కూడా సైబర్ మోసగాళ్లు 'SIM Swap' చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. RTGS బదిలీని చేయాలంటే OTPని యాక్సస్ చేయడానికి బ్లాంక్ లేదా మిస్డ్ కాల్‌లు చేస్తారు. స్కామర్‌లు పక్కనే ఉన్నకాల్ IVRలో పేర్కొన్న OTPని పొందే అవకాశం ఉంది. ఈ మోసంలో స్కామర్లు ప్రజల మొబైల్ ఫోన్ క్యారియర్‌లను కూడా సంప్రదించి, SIM కార్డ్‌ని యాక్టివేట్ చేస్తుంటారు. ఆ తర్వాతే సైబర్ మోసగాళ్లు బాధితుల ఫోన్‌ కంట్రోల్ తమ అధీనంలోకి తీసుకుంటారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

No comments:

Post a Comment

Popular Posts