Ad Code

రైలు పైకప్పుపై ఉండే ఈ గుండ్రని మూతలు ఎందుకు ?


రైలు పైకప్పుపై ఉన్న గుండ్రని ఆకారపు మూతలు కోచ్‌ల లోపల నుంచి కనిపించవు. బ్రిడ్జిల నుంచి లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నుంచి రైలు పైకప్పులను గమనిస్తే అవి కనిపిస్తాయి. రైళ్ల బోగీలపై వాటిని అమర్చడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది. ఇండియన్‌ రైల్వే వివరాల ప్రకారం.. రైలు పైకప్పుపై అమర్చే ఈ గుండ్రని మూతలు డిజైన్‌ కోసం అనుకుంటే పొరపాటే. ప్రయాణికులు సౌకర్యంగా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేశారు. వీటిని రూఫ్‌ వెంటిలేర్లు అంటారు. ఇవి కోచ్‌ లోపల ఉన్న ఉష్ణోగ్రతను సరి చేస్తుంటాయి. కోచ్‌లలో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. అలాంటి పరిస్థితిలో ప్రయాణికులు లోపల కూర్చున్నప్పుడు మరింతగా వేడి మొదలై ఇబ్బందులు పడుతుంటారు. అయితే ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు. రైలు లోపల ఉన్న వేడి గాలి ఈ గుండ్రని పైకప్పుల ద్వారా పైకి వెళ్లిపోతుంది. అలా పైకి వెళ్లే గాలి ఈ రూఫ్‌ వెంటిలేటర్ల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అందుకే రైలు బోగీల్లో కిటికీలు ఉన్నప్పటికీ, వేడి గాలిని బయటకు పంపడంలో ఈ రూప్‌ వెంటిలేటర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఒకవేళ వర్షం పడినా నీరు లోపలికి రాకుండా ఉండేలా వీటిని రూపొందించింది రైల్వే. ఇదండి రైలు పైకప్పుపై ఏర్పాటు చేసిన ఈ గుండ్రని రూప్‌ వెంటిలేటర్ల అర్థం.

Post a Comment

0 Comments

Close Menu