Ad Code

టీవీ కొంటే స్మార్ట్‌ఫోన్ ఉచితం !


అమెజాన్ బిగ్ గేమ్ ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ చెందని ప్రీమియం, బిగ్ స్క్రీన్ టీవీలపై పలు రకాల ఆఫర్లు పొందొచ్చు. ప్రీమియం లార్జ్ స్క్రీన్ టీవీ కొనుగోలు చేసిన వారికి ఈ సేల్‌లో భాగంగా కచ్చితమైన బహుమతులు లభిస్తాయి. నియో క్యూఎల్ఈడీ 8కే, నియో క్యూఎల్ఈడీ, క్యూఎల్ఈడీ, ఫ్రేమ్ టీవీ, ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ వంటి వాటికి ఆఫర్లు వర్తిస్తాయి. ఇది పరిమిత కాల ఆఫర్. ఎంపిక చేసిన టీవీల కొనుగోలుపై రూ.లక్ష విలువైన గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లేదా రూ. 50 వేలు విలువైన శాంసంగ్ అల్ట్రా సౌండ్ బార్ హెచ్‌డబ్ల్యూ ఎస్801బీ వంటివి ఉచితంగా పొందొచ్చు. అలాగే ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ ద్వారా కొనుగోలుదారులు శాంసంగ్ సౌండ్ టవర్ టీ 40 ఉచితంగా పొందొచ్చు. దీని రేటు రూ. 17,990. ఇంకా 75 ఇంచుల యూహెచ్‌డీ టీవీ కొంటే.. కస్టమర్లకు గెలాక్సీ ఏ23 ఫోన్ ఉచితంగా లభిస్తుంది. దీని విలువ రూ. 18,400. అలాగే నియో క్యూఎల్ఈడీ, క్యూఎల్ఈడీ టీవీలపై పదేళ్ల వరకు నో స్క్రీన్ బర్న్ వారంటీ లభిస్తుంది. ప్రముఖ రిటైల్ ఔట్‌లెట్స్ అన్నింటిలోనూ ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. లేదటే శాంసంగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆఫర్లు పొందొచ్చు. అలాగే ఈ డీల్స్‌తో పాటు శాంసంగ్ అదనంగా 20 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అయితే ఈ అదనపు తగ్గింపు డిస్కౌంట్ అనేది ఐసీఐసీఐ, ఆర్‌బీఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈజీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ.2 వేల నుంచి ప్రారంభం అవుతోంది. ఇకపోతే శాంసంగ్ స్మార్ట్ టీవీల్లో అదిరే ఫీచర్లు ఉంటాయనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఫీచర్ల మాదిరిగానే వీటి ధరలు కూడా భారీగానే ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu