Ad Code

రెడ్ మీ నోట్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు రేపటి నుండి సేల్ !


రెడ్ మీ నోట్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు రేపటి నుండి అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. ఈ సిరీస్ నుండి Redmi Note 12 5G, 12 Pro 5G మరియు 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది మరియు ఈ మూడు ఫోన్లు కూడా రేపటి నుండి సేల్ అవనున్నాయి. వీటిలో, 12 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 200MP భారీ కెమేరా మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. రెడ్ మీ నోట్ 12 ప్రో+ 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ.29,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో ధర రూ.32,999 ధరతో వచ్చింది. ఈ ఫోన్ జనవరి 11 నుండి అమెజాన్ మరియు mi స్టోర్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI మరియు డెబిట్ కార్డ్ EMI తో కొనేవారికి 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. Redmi Note 12 Pro+ 5G ఫోన్ 6.5-ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఈ డిస్ప్లే Dolby Vision సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ మీడియాటెక్ Dimensity 1080 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ 12GB RAM మరియు UFS2.2 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది. ఈ ఫోన్ MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది.ఈ ఫోన్ లో వెనుక భారీ ట్రిపుల్ రియర్ కెమెరాని అందించింది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 200MP మెయిన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. Xiaomi 12 Pro+ 5G ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్ లను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ 4,980mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ కేవలం 19 నిముషాల్లోనే 0 నుడి 100% ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu