భారత ఫిన్టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో కునాల్ షా నెలకు కేవలం రూ.15 వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.. సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' అంటూ నెటిజన్లతో కునాల్ షా ముచ్చటించారు. ఈ చర్చ సందర్భంగా నెటిజన్లు ఆయనకి అనేక ప్రశ్నలు వేశారు. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన 'నా శాలరీ నెలకు రూ.15 వేలే అని సమాధానం ఇచ్చారు. కంపెనీ లాభాలబాట పట్టేవరకూ నేను భారీ స్థాయిలో జీత భత్యాలు తీసుకోవడం సబబు కాదని భావిస్తున్నానన్న ఆయన, గతంలో నా కంపెనీ ఫ్రీ ఛార్జ్ను అమ్మేయగా వచ్చిన డబ్బు నాకు సరిపోతోంది అంటూ బదులిచ్చారు. మొత్తంగా సీఈవో కునాల్ షా. ఆ నెటిజన్తో చేసిన సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతుంటే, మరికొందరు సారు అంత తక్కువ జీతంతో మీరు ఎలా బతుకుతున్నారు అని అడిగేస్తున్నారు. కొందరు సీఈవోపై ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు ఈ ప్రకటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments