ఇండియాలో ట్విట్టర్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీస్ ప్రారంభమైంది. మొబైల్ యూజర్లు నెలకు రూ.900, వెబ్ యూజర్లు రూ.650 చొప్పున సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. నెలవారీతో పాటు యానువల్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ఒకేసారి ఏడాది సబ్స్క్రిప్షన్ తీసుకునే వారు రూ.6,800చెల్లించాలి. ఈ లెక్కన యానువల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు నెలకు రూ.566 చొప్పున చెల్లించినట్లవుతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి బ్లూ టిక్ తో పాటు ట్వీట్స్ ఎడిట్ ఆప్షన్, ఎక్కువ నిడివి గల వీడియోలు పోస్ట్ చేయడం, బుక్ మార్క్ ఆర్గనైజింగ్, కస్టమ్ యాప్ ఐకాన్స్, ఎన్ఎఫ్టీలను ప్రొఫైల్ పిక్చర్లుగా మార్చుకునే ఫీచర్లు అందించనుంది. ఇండియాలోని ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యూజర్లుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. అమెరికాలో ఇదే టిక్ మార్క్ సబ్స్క్రిప్షన్ కావాలంటే ఆండ్రాయిడ్, ఐవోఎస్ లకు నెలకు 11 డాలర్లు, వెబ్లో 8డాలర్లుగా ట్విట్టర్ నిర్ణయించింది. అక్కడ వార్షిక సభ్యత్వానికి 84 డాలర్లుగా ఫిక్స్ చేసింది. సెలెబ్రిటీలు, ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, ప్రముఖులు, మీడియా సంస్థలకే బ్లూ ట్లిక్ ఉండేది. కానీ టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను చేజిక్కించుకున్న తర్వాత కొత్త రూల్ తీసుకొచ్చారు. ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారందరికీ బ్లూటిక్ లభిస్తుందని ప్రకటించారు. దాంతో పాటు పోస్ట్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునేలా ఎడిట్ ట్వీట్ ఆప్షన్ కూడా ఈ సబ్స్క్రిప్షన్ తో పాటు రానుంది. ట్విట్టర్ బ్లూ టిక్తో చాలా బెనిఫిట్లు ఉన్నాయి. యాడ్స్ తగ్గడంతో పాటు మన పేరిట ఫేక్ అకౌంట్లు తగ్గే చాన్స్ ఉందట.! పెద్ద సైజ్ మెసేజ్లు, వీడియోలు పోస్ట్ చేస్కోవచ్చట.. ఇక ట్వీట్ను ఐదుసార్లు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.
0 Comments