ఆనంద్ మహీంద్ర మండే మోటివేషన్ పోస్ట్తో నెటిజన్ల ముందుకొచ్చారు. ఈసారి చెస్ గ్రాండ్మాస్టర్ మాగ్నస్ కార్ల్సెన్లా కావాలని కోరుకునే చిన్నారి వీడియోను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. హోసూర్లో ఇటీవల జరిగిన చెస్ ఛాంపియన్షిప్కు సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొన్న చిన్న బాలుడి స్టోరీని నెట్టింట షేర్ చేశారు. ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు రాత్రంతా బస్లో (రెండు బస్లు మారి) ప్రయాణించాడు. ఆపై వేదిక వద్దకు చేరుకుని పోటీ ప్రారంభమయ్యేలోగా కొద్దిసేపు కునుకుతీశాడు. మాగ్నస్ అంతటివాడు కావాలని ఈ చిన్నారి కోరుకుంటున్నాడు. ఇతడిలాంటి చిన్నారులే దేశ భవిష్యత్ను తీర్చిదిద్దుతారని ఆనంద్ మహీంద్రా ఈ పోస్ట్లో రాసుకొచ్చారు. ఆనంద్ మహీంద్రాతో పాటు పలువురు యూజర్లు యువ చెస్ ఆటగాడిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆల్ ది బెస్ట్ చాంపియన్ అంటూ ఐక్యూఓఓ ఇండియా సీఈఓ నిపుణ్ మౌర్య కామెంట్ చేయగా, క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లోనూ డబ్బు, సమయాన్ని వెచ్చిస్తే భారత్కు ప్రతిష్ట తీసుకువచ్చే యువ అంకితభావం కలిగిన యువత నైపుణ్యాలతో సిద్ధంగా ఉందని మరో యూజర్ రాసుకొచ్చారు.
0 Comments