Ad Code

రేపటి నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్ !


ఫ్లిప్ కార్ట్ లో రేపటి నుంచి  బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని ప్రకటించింది. ఈ సమ్మర్ లో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, స్మార్ట్ టీవీలు కొనాలని ప్లాన్ చేసే వారికి ఈ సేల్ సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. చాలా తక్కువ ధరకే డిస్కౌంట్లతో ఈ వస్తువులను సేల్ లో సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ లో ఏసీలను రూ.21,490 ప్రారంభ ధరతో కొనుగోలు చేసుకోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్స్ ను 45 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. శామ్ సంగ్, ఎల్జీ, ఓల్టాస్ తదితర కంపెనీలకు చెందిన ఎనర్జీ ఎఫీషియంట్ ఏసీలపై రూ.40 వేల వరకు తగ్గింపు ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. టాప్ వాటర్ ప్యూరిఫైయర్ లపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. 4&5 రిఫ్రిజిరేటర్లను రూ.13,990 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. బ్రేక్ ఫాస్ట్ అప్లియెన్సెస్.. కెటిల్స్, కాఫీ మేకర్స్ పై 70 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. ఇంకా జ్యూస్ మిక్సర్ గ్రైండర్లను రూ.1,199 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. మైక్రోవేవ్స్ పై ఈ సేల్ లో భారీ ఆఫర్లు ఉన్నాయి. రూ.1,999 ప్రారంభ ధరతో వాటిని కొనేయొచ్చు. డిష్ వాషర్లు సైతం రూ.19.490 ప్రారంభ ధరతో కొనేయొచ్చు. ఈ సేల్ లో బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu