ప్రముఖ ఫిన్టెక్ సంస్థ జెస్ట్మనీ 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. అయితే, ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని పరిహారం కింద ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు జీవిత బీమా, మానసిక ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలను సైతం కల్పిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జెస్ట్మనీని విక్రయానికి సంబంధించి ఫోన్పేతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాగా, వేటుకు గురైన ఉద్యోగులలో చాలామందిని ఫోన్పే నియమించుకునే అవకాశం ఉందని, ఇప్పటికే రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
0 Comments