Ad Code

ఎంబీఏ స్టూడెంట్‌కు మైక్రోసాఫ్ట్ రికార్డు స్థాయి ప్యాకేజ్ !


ఒడిశాలోని సంబల్‌పుర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో ఓ విద్యార్థిని రికార్డ్ సృష్టించింది. సంబల్‌పుర్ ఐఐఎం చరిత్రలోనే హయ్యెస్ట్ ప్యాకేజీని పొందిన స్టూడెంట్‌గా ఘనత సాధించింది. ఏకంగా రూ.64.61 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించి ఇన్‌స్టిట్యూట్‌కే గర్వకారణంగా నిలిచింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ విద్యార్థినిని హైర్ చేసుకోవడం విశేషం. సంబల్‌పుర్ ఐఐఎంలో ఏటా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతుంటుంది. ఈ సారి కూడా డ్రైవ్‌ని చేపట్టగా దాదాపు 130కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఈ డ్రైవ్‌లో విద్యార్థిని అవని మల్హోత్రా పాల్గొని మునుపెన్నడూ లేని విధంగా రూ.64.61 లక్షల వార్షిక ప్యాకేజీని సంపాదించినట్లు ఇన్‌స్టిట్యూట్ వర్గాలు వెల్లడించాయి. విద్యాసంస్థ చరిత్రలోనే ఇది హైయ్యెస్ట్ ప్యాకేజీ అంటూ సంస్థ కొనియాడింది. దీంతో పాటు 2021-23 బ్యాచ్‌కి గాను 100 శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించి చరిత్ర సృష్టించినట్లు ఐఐఎం సంబల్‌పుర్ ప్రకటించింది.

Post a Comment

0 Comments

Close Menu