జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ప్రొఫెషనల్స్గా మనం నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని డెల్ టెక్నాలజీస్ ఇండియా కన్జూమర్, స్మాల్ బిజినెస్ వీపీ, ఎండీ రాజ్ కుమార్ రిషీ అన్నారు. లేటెస్ట్గా ముందుకొస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆ నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవడం కీలకమని స్పష్టం చేశారు. నిరంతరం మారుతున్న జాబ్ మార్కెట్లో నిలబడాలంటే నూతన టెక్నాలజీలని అందిపుచ్చుకుని కెరీర్లో ముందుకు సాగాల్సిందేనని అన్నారు. ఏఐ అయినా మరో టెక్నాలజీ అయినా మన నైపుణ్యాలు మెరుగుపడేలా వాటిని అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈరోజు గేమింగ్, వీడియో ఎడిటింగ్, మ్యూజిక్ సహా పలు కెరీర్ అవకాశాలు ముందుకొచ్చాయని వాటిపై కూడా దృష్టి సారించాలని చెప్పారు.
0 Comments