Ad Code

'హీరో' నుంచి త్వరలోనే 'ప్యాషన్​ ప్లస్' రీ లాంఛ్​!


మనలాంటి ఎదుగుతున్న దేశాల్లో కార్ల కంటే కూడా ఎక్కువగా బైకులు, స్కూటర్లు లాంటి ద్విచక్ర వాహనాలను వాడుతుంటారు. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు, విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు ఎక్కువగా వీటి మీదే ఆధారపడతారు. మధ్య తరగతి జనాభా అధికంగా ఉండే మన దేశంలో కార్లు కొనే సత్తా ఉన్నవారు చాలా తక్కువ. అత్యధికులు ద్విచక్ర వాహనాలను వాడుతుంటారు. కాబట్టి ప్రపంచంలోని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు భారత్ మీద దృష్టి సారిస్తున్నాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారైన హీరో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రికార్డు స్థాయిలో నూతన ద్విచక్ర వాహనాలను మార్కెట్​లోకి తీసుకురానుంది హీరో సంస్థ. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు సరికొత్త మోడళ్లను వినియోగదారులకు పరిచయం చేయాలని చూస్తోంది. తొలుత ఎక్స్​పల్స్ 200 4వీ రివైజ్డ్​ వెర్షన్​ను అందుబాటులోకి తీసుకురానుంది. హీరో తీసుకొచ్చిన ఎక్స్ పల్స్ మోడల్ బాగా విజయవంతం అయింది. ఈ బైక్​ను కొనేందుకు యువత ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో ఎక్స్​పల్స్​లో మరిన్ని మార్పులుచేర్పులు చేసి 2023-అప్​డేటెడ్ వెర్షన్​ను హీరో ఎక్స్​పల్స్ 200 4వీ 2023 మోడల్ రూపంలో తీసుకొస్తోంది హీరో సంస్థ. కొత్త మోడల్​లో డ్యుయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ తో పాటు ర్యాలీ, రోడ్, ఆఫ్ రోడ్ లాంటి డ్రైవింగ్ మోడ్ ఫీచర్లను కూడా అందిస్తోంది. రైడర్లకు మరింత విజిబిలిటీ కోసం కొత్త ఎల్​ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ ఈడీ డే లైట్ రన్నింగ్ లైట్​లను కూడా హీరో జత చేసింది. అలాగే వైడ్​స్క్రీన్​ను సైజును పెంచింది, కొత్త స్విచ్ గేర్​ను కూడా అందిస్తోంది. ఈ ఫీచర్లను మినహాయిస్తే పాత మోడల్​లో వేరే మార్పులేమీ చేయలేదు. హీరో బైక్స్​లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న మోడల్స్​లో ఎక్స్​ట్రీమ్ 160ఆర్​ ఒకటి. ఈ బైక్​కు ఉన్న డిమాండ్ దృష్ట్యా కస్టమర్లు కోరిన పలు మార్పులుచేర్పులను చేసి అప్​డేటెడ్ వెర్షన్​ను తీసకొస్తోంది హీరో. ఇందులో అప్​సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ ఫీచర్ జత చేసినట్లు తెలుస్తోంది. అలాగే కొత్త పెయింట్ స్కీమ్స్​తో వీటిని మార్కెట్​లోకి తీసుకొస్తున్నారట. కొత్త మోడల్​లో ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్​ను కూడా మార్చారట. మరో ఒకట్రెండు నెలల్లో 160ఆర్​ను లాంఛ్ చేస్తారని సమాచారం. ఇందులో డ్యుయల్ ఛానల్ ఏబీఎస్ సిస్టమ్ ఫీచర్ కూడా ఉందట. ఈ అధునాతన ఫీచర్ల వల్ల బైక్​కు మరింత డిమాండ్ ఉంటుందని.. తద్వారా మార్కెట్ లో దూసుకుపోతున్న బజాజ్ పల్సర్ ఎన్160కి ఇది గట్టి పోటీనివ్వొచ్చని హీరో భావిస్తోంది. మధ్య తరగతి ప్రజలు ఎంతగానో ఆదరించిన బైక్ హీరో ప్యాషన్ ప్లస్. కొన్నేళ్ల పాటు భారత మార్కెట్​లో ఈ బైక్ మంచి ఆదరణ సంపాందించింది. అందుకే ఈ బైక్​ను రీలాంఛ్ చేస్తోంది హీరో సంస్థ. కొత్త మోడల్​లో కలర్ స్కీమ్స్, లుక్స్ అన్నీ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. 97.2 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్​తో రానున్న కొత్త ప్యాషన్ ప్లస్.. 7.91 బీహెచ్​పీ పవర్ ఔట్​పుట్, 8.05 ఎన్​ఎమ్ టార్క్​ను ఉత్పత్తి చేయగలదు. గతంలో ఎన్నో సంచనాలు సృష్టించిన ప్యాషన్ ప్లస్.. రీలాంఛ్ అయ్యాక ఇంకెన్ని ప్రకంపనలు రేపుతుందో చూడాలి. ఎక్స్​ట్రీమ్ 200టీకి వస్తున్న ఆదరణ దృష్ట్యా దీనికి అప్​గ్రేడెడ్ వెర్షన్​ను మార్కెట్​లోకి తీసుకురానుంది హీరో సంస్థ. 200టీకి ఉండే 199.6 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ 4వీ ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచి.. 200ఎస్​గా బయటకు తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ బైక్​ను డీలర్లకు చూపించింది హీరో. 200ఎస్​ను 18.83 బీహెచ్​పీ పవర్, 17.3 ఎన్ఎం టార్క్​తో అభివృద్ధి చేసింది.  హీరో సంస్థ ప్రవేశపెట్టిన బైక్స్​లో బాగా పాపులర్ అయిన మరో మోడల్ కరిజ్మా. సినిమాల్లో కూడా ఈ బైక్​ను ఎక్కువగా వాడేవారు. దీంతో అప్పట్లో యువతకు ఇది కలల వాహనంగా మారింది. అయితే ఆ తర్వాత ఇది కనుమరుగైంది. మొత్తానికి తిరిగి ఎంట్రీ ఇవ్వనుంది కరిజ్మా. ఈ ఏడాది ఆఖరుకు లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ 210 బైక్ మార్కెట్​లోకి రానుంది. దీన్ని సూపర్ స్పోర్ట్ బైక్​గా హీరో రూపొందిస్తోంది. కేటీఎం ఆర్ సీ 200, యమహా ఆర్ 15 వీ3, సుజుకీ ఎస్ ఎఫ్ 250, బజాజ్ పల్సర్ ఆర్​ఎస్ 200 లకు పోటీగా కరిజ్మా ఎక్స్ ఎంఆర్ 210ను తీసుకొస్తోంది హీరో. పాత కరిజ్మా డిజైన్​లో పెద్దగా మార్పులు చేయకుండానే ఎక్స్​ ఎంఆర్ 210ను తయారు చేశారు. అయితే ఫీచర్లు, అధునాతన సాంకేతికతను మాత్రం జత చేశారు. ఈ బైక్ కోసం సరికొత్త 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్​ను అభివృద్ధి చేసింది హీరో సంస్థ.

Post a Comment

0 Comments

Close Menu