Ad Code

వారానికి మూడు రోజులు ఆఫీసుకి తప్పనిసరి రావాలి !


విప్రో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది.ఇక మీదట ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి టాప్‌ సంస్థలు ఉద్యోగుల్ని ఆఫీసుకు వచ్చి పని చేయాలని సూచించాయి. ఇప్పుడు విప్రో కూడా తమ ఉద్యోగులకు ఇలాంటి సూచనే చేసింది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే అని స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు నవంబర్‌ 6వ తేదీన ఉద్యోగులకు మెయిల్‌ ద్వారా సమాచారాన్ని అందించింది. ఈ ఆదేశాలు నవంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటికే 55 శాతం మంది ఉద్యోగులు వారానికి మూడుసార్లు ఆఫీసులకు వస్తున్నారు. అయితే మిగతా ఉద్యోగులు కూడా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ను ముగించి హైబ్రిడ్ తరహలో ఆఫీసుల నుంచి పనిచేయాలని, దీని వల్ల వృత్తిపరమైన అభివృద్ధి ఉండటంతో పాటు సహోద్యోగులు, క్లయింట్లతో నేరుగా సంభాషిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని ఐటీ సంస్థ పేర్కొంది.


Post a Comment

0 Comments

Close Menu