సాధారణంగా రైలు టికెట్ బుక్ చేసుకోవాలన్నా, ఎటువంటి ఫిర్యాదులు చేయాలన్నా, ట్రైన్ రన్నింగ్తో పాటు పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవాలన్నా రకరకాల యాప్స్ని వాడాల్సి వస్తోంది. ఈ సేవలన్నీ ఒకే యాప్లో అందుబాటులో లేవు. ఇప్పుడు ఆ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వే 'సూపర్ యాప్'తో సిద్ధమవుతోంది. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈ కొత్త యాప్ని డెవలప్ చేస్తోంది. ఈ యాప్ కోసం రైల్వే శాఖ రూ.90 కోట్లు వెచ్చించనుందని 'ఎకనమిక్ టైమ్స్' పేర్కొంది. భారతీయ రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడమే ఈ యాప్ ఉద్దేశం. ఈ యాప్ అందుబాటులోకి వచ్చాక, యూజర్లకు ఇక ఇతర యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. యూజర్ల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ కొత్త యాప్ని తీర్చిదిద్దుతున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది. అయితే.. ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రూ.90 కోట్ల బడ్జెట్తో మొత్తం మూడేళ్లలో దీనిని డెవలప్ చేయాలన్న ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది.
0 Comments