Ad Code

మోడీ, యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీచర్ పై సస్పెన్షన్ వేటు!


త్తరప్రదేశ్‌ కౌశంబి జిల్లాకు  చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వర్ష ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోస్ట్ నేపథ్యంలో కోఖ్రజ్ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు సైతం నమోదు అయింది. అయితే టీచర్ వర్ష అభ్యంతరకర వ్యాఖ్యలపై విద్యా శాఖ సీరియస్ అయింది. ఆ క్రమంలో విద్యాశాఖ అధికారి కమలమేంద్ర కుష్వానా ఆమెను సస్పెన్షన్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు ఆదివారం సమాచారం అందడంతో వారు టీచర్ వర్షపై కేసు నమోదు చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu