Ad Code

ముంబయి ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన విమాన ప్రమాదం !


యిరిండియా విమానానికి ముంబై విమానాశ్రయంలో తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదే సమయానికి ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. దీంతో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ఆదేశించడంతో పాటు డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని తొలగించింది. ఈ రెండు విమానాలు దగ్గరిగా వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu