తెలంగాణలో 15 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్, హోంగార్డుల, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా విజయ్ కుమార్ (పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు బాధ్యతలు), టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్ కుమార్,రాచకొండ పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబు, ఏసీబీ డైరెక్టర్గా తరుణ్ జోషి, మల్టీజోన్-1 ఐజీగా ఎస్.చంద్రశేఖర్రెడ్డి,మల్టీజోన్ -2 ఐజీగా వి.సత్యనారాయణ, రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా కె.రమేశ్ నాయుడు, మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్రెడ్డి, వనపర్తి ఎస్పీగా ఆర్.గిరిధర్,హైదరాబాద్ తూర్పు మండలం డీసీపీగా జి.బాలస్వామి, హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీగా జి.చంద్రమోహన్, సీఏఆర్హెడ్ క్వాటర్స్ డీసీపీగా రక్షితమూర్తి
0 Comments