ముంబయిలో శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే గర్ల్ఫ్రెండ్కు 40 సార్లు ఫోన్ చేశాడని తాజాగా వెల్లడైంది. తర్వాత ఆటోలో ఆమె ఇంటికి వెళ్లాడని పోలీసులు గుర్తించారు. దాంతో ఆమెను కూడా విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం తాను ప్రయాణిస్తోన్న కారును బాంద్రాలోని కాలా నగర్లో వదిలేసి, గోరెగావ్లో ఉన్న గర్ల్ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ రెండు గంటలు ఉన్నాడు. తర్వాత ఆమె మిహిర్ సోదరికి కారు ప్రమాదం గురించి సమాచారం ఇచ్చింది. మిహిర్ సోదరి వచ్చి, అతడిని బోరివల్లిలోని ఇంటికి తీసుకు వచ్చింది. తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి షాపుర్లోని రిసార్టుకు వెళ్లిపోయారు. అది ముంబయికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత స్నేహితుడితో పాటు తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పుడే అతడి స్నేహితుడు 15 నిమిషాల పాటు ఫోన్ ఆన్ చేయడంతో లొకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు మిహిర్ను అరెస్టు చేశారు.
0 Comments