దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్గా అధికారి కోట్ల ఉదయనాథ్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ 2012 మ్యాచ్ అధికారి. ఆయన స్వస్థలం తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తి చేశారు. కోట్ల ఉదయనాథ్ రైల్వేలో ఆర్థిక నిర్వహణ, అకౌంటెన్సీలో అనుభవం ఉన్నది. ఇంతకు ముందు సికింద్రాబాద్లోని దక్షిణ మధ్య రైల్వేలోని కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్లో డిప్యూటీ ఫైనాన్షియల్ అడ్వైజర్, చీఫ్ అకౌంట్స్ అధికారిగా పని చేశారు. గడిచిన వీరి పదేళ్ల సర్వీస్లో దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లో డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్, నాందేడ్ డివిజన్లో సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు.
0 Comments