Ad Code

కడప ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వస్తే షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తా !


ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ ను తాము కుటుంబసభ్యుడిగా భావిస్తామని, ఎన్ని ఏళ్లు గడిచినా ఆయన్ను మరిచిపోలేమని అన్నారు. ఈ సభలోనే సీఎం రేవంత్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వస్తే వైఎస్ షర్మిలను గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని, కడపలో షర్మిలకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని వెల్లడించారు. ''శాసనమండలిలో నేను మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ నన్ను ప్రోత్సహించారు. ప్రతిపక్ష సభ్యుల విషయంలోనూ ఆయన ఎంతో ఉదారంగా ఉండేవారు. కార్మికులు, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నించేవారు. ఏ పదవీ రాకున్నా పార్టీని వీడలేదు. గతంలో వైఎస్ఆర్ పోషించిన ప్రతిపక్ష పాత్రే ఇప్పుడు షర్మిల పోషిస్తున్నారు. ప్రజల పక్షాన ఆమె అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం వృథాగా పోదు''అని రేవంత్రెడ్డి అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu