Ad Code

తొమ్మిదేళ్ల చిన్నారిపై మైనర్ల అత్యాచారం - హత్య !


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. రెండవ కుమార్తె వాసంతి 5వ తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఉదయం ఆడుకుంటానని ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్ళింది. మధ్యాహ్నం దాటినా ఇంటికి రాలేదు. ఎక్కడుందోనని వెతికారు, కనిపించకపోవడంతో పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత రోజే ఎంపీ బైరెడ్డి శబరి విజయోత్సవ సభ నందికొట్కూరులో ఉండగా ఆమెకు బాలిక అదృశ్యంపై సమాచారం ఇచ్చారు. వెంటనే ఆచూకీ కనుక్కోవాలని పోలీసులను ఆదేశించారు. రెండు రోజులపాటు వెతికినా ఆచూకీ దొరకలేదు. మూడవ రోజు పోలీస్ జాగిలాలతో పరిశీలించారు. పోలీసు జాగిలం పార్కు వద్ద నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని ముచ్చుమర్రి లిఫ్ట్ అప్రోచ్ కెనాల్ వరకు వెళ్లింది. బాలిక ఆడుకున్న పార్కులో విచారించారు. ముగ్గురు మైనర్ బాలురుపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టయిల్ లో పోలీసులు విచారించారు. అందులో ఒకరు బాలిక వాసంతిపై అత్యాచారం చేసి మల్యాల ఎత్తిపోతల కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. అనుమానితులు ముగ్గురు 15 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu