Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Thursday, March 14, 2013

సినిమాల్లో జేమ్స్‌బాండ్‌ ల్యాప్‌టాప్‌

http://2.bp.blogspot.com/-N-CrfUIB2N8/UH5HwDTh6DI/AAAAAAAABQU/TIo3NcFCLxI/s1600/007_USB.jpgసినిమాల్లో జేమ్స్‌బాండ్‌ ల్యాప్‌టాప్‌ ద్వారా శత్రువు ఎక్కడ ఉన్నాడో చూసి, శత్రువుకి సంబంధించిన డేటాను క్షణాల్లో సంపాదించటం పలుసార్లు చూశాము. కానీ మారిన టెక్నాలజీతో ప్రతి ఒక్కరికీ తమ కంప్యూటర్‌ డేటాను కాపాడుకోవటం అతిపెద్ద సమస్యగా మారింది. అందులోనూ ల్యాప్‌టాప్‌ను వినియోగించేవారికి ఇది మరీ ఎక్కువగా ఉంది. గతంలో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని వినియోగించుకొన్న కొద్ది రోజులకే, కొత్త మోడల్‌ మార్కెట్‌లోకి రావటం, లేకపోతే సరికొత్త చిప్‌ను చిప్‌ తయారీ కంపెనీలు విడుదల చేయటం జరిగేది. కొత్తగా వచ్చిన వాటితో తమ ల్యాప్‌టాప్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలనుకున్నప్పుడు అనేకరకాలైన అవాంతరాలు ఎదురు అవుతాయి.
పాతతరం ల్యాప్‌టాప్‌లతో రిపేర్ల సమస్యలు, ల్యాప్‌టాప్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలన్నా ఖరీదైన వ్యవహారంగా ల్యాప్‌టాప్‌ పోతే, అందులోని డేటాను తిరిగి పొందటం చాలా కష్టం. మరియు . అదీగాక, పొరపాటున చేతిలో నుంచి జారినా, కిందపడి డ్యామేజి అయినా, అందులో ఉన్నటువంటి హార్డ్‌డిస్క్‌ కరెప్ట్‌ అయితే, ఇంక డేటా అంతే.
మారిన టెక్నాలజీ వల్ల అత్యాధునికమైనటువంటి ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో పోయిన ల్యాప్‌టాప్‌ ఆన్‌ చేస్తే చాలు. అందులోని డేటాను తిరిగి మీ మెయిల్‌కు వచ్చే విధంగానూ ఏర్పాట్లు చేసుకోవచ్చు.అంతేగాక, హార్డ్‌డిస్క్‌ను, ల్యాప్‌టాప్‌ను సైతం చాలా ధృడమైనటువంటి మెటీరియల్‌తో తయారు చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటి ల్యాప్‌టాప్‌లు నిప్పులోనూ, నీటిలో మునిగినా తట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు.
గతంలో ఉన్నటువంటి హార్డ్‌డిస్క్‌ల కన్నా భారీ పరిమాణంలో ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌లు లభించటం ఓ రకం అయితే, వాటిలో అత్యాధునికమైనటువంటి ఫీచర్లు సైతం తక్కువకే లభించటం వీటి ప్రత్యేకతను తెలుపుతున్నాయి. ప్రస్తుత తరంలో అతి తక్కువ ధరకే రూ.18వేల నుంచి లభిస్తున్నాయి. దీంతో వీటిని వినియోగించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గతంలో 100 మందిలో 12 మంది వద్ద మాత్రమే కంప్యూటర్స్‌ ఉంటే, ప్రస్తుతం ఆ స్ధానాన్ని ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో కంప్యూటర్లను కొనుగోలు చేసే వారిలో ఎక్కువ మంది డెస్క్‌టాప్‌ల కంటే, ల్యాప్‌టాప్‌ల కొనుగోలు వైపే మెగ్గు చూపుతున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల భారత్‌లో ల్యాప్‌టాప్‌ వినియోగదారులను సర్వే చేయగా వారు తాము కొనుగోలు చేసే ల్యాప్‌టాప్‌ను ఎందుకు ఎంపిక చేసుకుంటున్నారని ప్రశిస్తే, తాము కొనుగోలు చేసే ల్యాప్‌టాప్‌ తాము ఇండోర్‌లో ఉన్నసమయంలోనూ వర్క్‌ చేసుకోవటానికి అనుకూలంగా ఉండటమే కారణంగా తెలిపారు. మరొక విషయం ఏమిటంటే..తాము ఏ ల్యాప్‌టాప్‌ ఛాసిస్‌ ధృఢంగానూ, దాన్ని అప్‌గ్రేడ్‌ చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుందో ఆ ల్యాప్‌టాప్‌నే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక ఇంటర్నల్‌గా బ్లూటూత్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ ఉన్నట్లయితే వాటితో ప్రయివేట్‌ ఛాటింగ్‌ చేసుకోవటం ఎంతో సులభమని పలువురు భారతీయ యువతీయువకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ధృఢంగానూ అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకొన్నటువంటి ల్యాప్‌టాప్‌లలో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న మోడల్‌ తొషిబా కంపెనీకి చెందినది. ఎందువల్ల అంటే దీన్ని అత్యాధునికమైనటువంటి పాలిమర్‌ మెటీరియల్‌ నుంచి తయారుచేశారు. ఇది గీతలు, మంటలు, నీటిలో తడిసినా అందులోని డేటాకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదు.
మారుతున్న టెక్నాలజీ..
ట్రస్టడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ మాడ్యుల్‌ (టిఎమ్‌పి)ను స్టాండర్డ్‌గా కంప్యూటర్‌ తయారీ కంపెనీలు తీసుకొన్నాయి. దీని ఆధారంగానే కంప్యూటర్‌ తయారీ కంపెనీలు ఒక అలయెన్స్‌గా ఒప్పందం ప్రకారం హార్డ్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవటానికి వీలు కల్పిస్తున్నాయి. దీని వల్ల వినియోగదారులు తమకు నచ్చిన ప్రకారం ల్యాప్‌టాప్‌ను మార్చుకునే సౌలభ్యం ప్రస్తుత టెక్నాలజీ వల్ల సాధ్యమౌతోంది. అంతేగాక ఈ టిఎమ్‌పి వల్ల హార్డ్‌వేర్‌కు రక్షణ ఏర్పాట్లు కలగటమేగాక, ఇతరుల నుంచి చౌర్యం చేసినటువంటి ల్యాప్‌టాప్‌లను ఇట్టే సులభంగా తెలుసుకోవచ్చు. అంటే...సెక్యూరిటీ అనేది అంతర్గతంగా ల్యాప్‌టాప్‌లో పొందుపరచటం వల్ల అల్గారిథమ్స్‌ ఎంబీడెడ్‌ ఆధారంగా మైక్రోచిప్‌ను ఇందులో అమరుస్తారు. ఈ మైక్రోచిప్‌ ద్వారా టిఎమ్‌పి ఎన్‌క్రిప్షన్‌గా ఉండటం వల్ల హార్డ్‌డిస్క్‌లో ఉన్నటువంటి డేటాకు రక్షణగా నిలుస్తుంది.
ఈ టిపిఎమ్‌ సిస్టమ్‌ ఆధారంగా ఏ ల్యాప్‌టాప్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌ పని చేస్తాయో, ఆ నెట్‌వర్క్‌లోకి మీరు అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నిస్తే, అది దుర్లభం. అంతేగాక అందులోకి మీరు యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ను తప్పకుండా ఎంటర్‌ చేయాలి. సరైన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయకపోతే మీరు ప్రవేశించటం అడ్డుకోవటమే గాక, మీరు అక్రమంగా నెట్‌వర్క్‌లోకి చొరబడుతున్నారని సర్వర్‌ని అలర్ట్‌ చేస్తుంది. పదేపదే మీరు అక్రమంగా ప్రవేశించటానికి ప్రయత్నిస్తే మీ సిస్టమ్‌ను హ్యాంగ్‌ చేయగల సత్తా ఈ టెక్నాలజీకి ఉంది. ఇందులోనూ అప్‌గ్రేడ్‌ టెక్నాలజీ సైతం వచ్చింది. దీని సాయంతో మీరు సిస్టమ్‌కు ఫింగర్‌ ప్రింట్‌, లేకపోతే బయో మెట్రిక్‌ ఆధారిత టెక్నాలజీని పాస్‌వర్డ్‌గా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఇతరులు ఎవ్వరూ అక్రమంగా డేటాను చోరీ చేయలేరు.

Wednesday, March 13, 2013

3డి బ్రెయిన్‌

ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనిషి మెదడుకు సంబంధించిన చిత్రాలు 2డిలో మాత్రమే వీక్షించే సౌలభ్యం ఉంది. కానీ, డ్యూక్‌ యూనివర్శిటీ పరిశోధకులు సరికొత్త తరహా ఆల్ట్రాసౌండ్‌ ఎండోస్కోప్‌ పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీనిసాయంతో మనిషి మెదడుకు సంబంధించిన మరింత ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే దీన్ని వివిధ జంతువులు, ఎంపిక చేసిన వ్యక్తులపై ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఇది విజయవంతం అయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2డి విధానం కన్నా ఇది చాలా తక్కువ ధరకే లభించనున్నదని, మరింత మెరుగైన ఫలితాలు సైతం దీని ద్వారా వైద్యులు పొందవచ్చునని డ్యూక్‌ యూనివర్శిటీలో ఈ 3డి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.కిర్క్‌షుంగ్‌ వ్యాఖ్యానించారు. తొలిసారిగా ఈ 3డి మెదడుకు సంబంధించిన ప్రయోగం కుక్కలపై ప్రయోగించామని ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో, ఈ ప్రాజెక్ట్‌ను మరింత ముందుకు తీసుకురావటంతో ఊహించని దానికన్నా తక్కువ వ్యయం, కాలంలోనే ఇది పూర్తయిందని ఆయన అన్నారు. తొలిసారిగా కుక్కకు మత్తు ఇచ్చి, దాని మెదడును స్పష్టంగా తీయగలినట్లు తెలిపారు. ప్రస్తుతం న్యూరోసర్జన్‌లు తమ దగ్గరకు వచ్చిన రోగి మెదడుకి సంబంధించిన వివరాలను సిటి స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐల ద్వారా తెలుసుకొని ఆపరేషన్స్‌ చేస్తున్నారు. అయితే ఇలా ఆపరేషన్‌ చేసే సమయంలో ఒక్కోసారి వారికి అనేకరకాలైన అవాంతరాలు ఎదురైతున్నాయి. అటువంటి వాటన్నిటికీ ఏకైక పరిష్కారమే ఈ 3డి అల్ట్రాసౌండ్‌ ఎండోస్కోప్‌గా ఆయన పేర్కొంటున్నారు. దీని వల్ల డాక్టర్స్‌కి రోగి మెదడు గురించి పూర్తి అవగాహన ఏర్పడుతుంది.
దీనిపై ఆయన మరింత సమాచారం వెల్లడిస్తూ... ఉదాహరణకు సిటి స్కానింగ్‌ విధానాన్నే తీసుకుందాము. ఇది అయస్కాంత సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. తద్వారా అయస్కాంతా కిరణాలు పరావర్తనం చెంది మనిషి మెదడుకు సంబంధించిన
వివరాలను స్క్రీన్‌పై 2డి విధానంలో ప్రతిబింబిస్తాయి. అయితే ఫలితాలు నూటికి నూరు శాతమని ఎవ్వరూ ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేరు. అంతేగాక, ఈ విధానం చాలా ఖరీదైన వ్యవహారం కూడా. మెదడులో కణతలను తొలగించటానికి దీనిపై ఎక్కువగా న్యూరోసర్జన్స్‌ ఆధారపడతారు. అయితే తాము అభివృద్ధి చేసిన 3డి విధానం ద్వారా ఖచ్చితంగా నూటికి నూరు శాతం కణతను ఎంత పరిమాణంలో ఉందో, దాన్ని ఎంతమేర తొలగించవచ్చునో, ముందుగానే సులభంగా న్యూరోసర్జన్లు గుర్తించగలరని ఈ ప్రాజెక్ట్‌లో పాలుపంచుకుంటున్న డ్యూక్‌ యూనివర్శిటీకి చెందిన బయో ఇంజనీర్‌ స్టీఫెన్‌ స్మిత్‌ వ్యాఖ్యానించారు. ఈ 3డికి, 2డికి మధ్యన తేడా ధరలోనే కాదు, పనితీరులోనే అసలు వ్యత్యాసం ఉందని తెలుపుతున్నారు. ఎందువల్ల అంటే...ఈ 3డి విధానంలో మెదడుకి సంబంధించిన అతి చిన్న భాగాన్ని సైతం ఎంతో స్పష్టంగా చిత్రీకరించగలదు అదీ ఎంతో నాణ్యతతో.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఈ 3డి విధానాన్ని 1980ల్లోనే శాస్త్రవేత్తలు చేపట్టినప్పటికీ, అప్పట్లో అవాంతరాలు ఏర్పడటంతో ఈ ప్రయోగాన్ని ఆపారు. మళ్లీ 27 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టి విజయవంతం అయింది.
దీన్ని ఎలా రూపొందించారు?
ఈ 3డి అల్ట్రాసౌండ్‌ ఎండోస్కోప్‌కి 100 నుంచి 500 వైర్లు ఏర్పాటు చేసి దీన్ని ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్‌కి అనుసంధానం చేశారు. దాని నుంచి అల్ట్రా సౌండ్‌ కిరణాలను నాజిల్‌ ద్వారా ప్రసరింపజేశారు. ఇలా ప్రసారమయ్యే కిరణాలను విశ్లేషించటానికి 500 ట్రాన్స్‌మిటర్స్‌ను అమర్చటం జరిగింది.

Thursday, March 7, 2013

లైవ్‌ ద్వారా మెసెంజర్‌

http://i2.kym-cdn.com/entries/icons/original/000/008/134/nokia-3310-troubleshooting.jpgఅవును..ఉచితంగానే సెల్‌ ఛాటింగ్‌ను నిర్వహించు కోవచ్చునని ఎయిర్‌టెల్‌ వెల్లడిస్తోంది. ఈ సౌకర్యం ఎయిర్‌టెల్‌ వినియోగ దారులు ఎయిర్‌టెల్‌ మెసెంజర్‌ ద్వారా వివిధ కమ్యూనిటిలతో ఛాటింగ్‌ చేసుకోవచ్చునని సంస్థ తెలిపింది. ఇది ప్రముఖ ఛాటింగ్‌ సంస్థ అయిన యాహూ మెసెంజర్‌ను పోలి ఉంటుందని, కంప్యూటర్‌ లేకుండానే ఛాటింగ్‌ను సులభంగా నిర్వహించుకునే సౌలభ్యం దీని ద్వారా లభ్యమవుతుందని సంస్థ తెలిపింది.
ఈ ఫీచర్‌ ద్వారా...
ఆన్‌లైన్‌ కమ్యూనిటీని సెల్‌ఫోన్‌ ద్వారా నిర్మించుకోవచ్చు. మీ మిత్రుల స్టేటస్‌(పరిస్థితి)ను తెలియజేసే ఐకాన్‌ సైతం దీంట్లో లభిస్తుందని ఎయిర్‌టెల్‌ తెలుపుతోంది. (ఉదాహరణకు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌/బిజీ/మీటింగ్‌...వంటి వివరాలు తెలిపే ఐకాన్‌)
ఒక వర్గానికి చెందిన వారితో ఎప్పుడైనా ప్రత్యేకంగా ఛాటింగ్‌ చేసుకునే సౌలభ్యం. ఇతరులతో మీరు ఛాటింగ్‌ చేసిన వివరాలు సైతం పొందవచ్చు.
మీ భావలను ఆకర్షణీమైన విధంగా అక్షరరూపంలోనూ తెలియజేయవచ్చు.
ఈ ఫీచర్‌ పొందాలంటే..
ఒక జిపిఆర్‌ఎస్‌ సదుపాయం ఉన్న హ్యాండ్‌సెట్‌
జిపిఆర్‌ఎస్‌ ఢఫాీల్ట్‌గా ఉన్న ఎయిర్‌టెల్‌ కనెక్షన్‌. దీంట్లోనే ఎయిర్‌టెల్‌ మెసెంజర్‌ సర్వీస్‌ ద్వారా ఇతరులతో ఛాటింగ్‌ చేసుకోవచ్చు. అయితే హ్యాండ్‌సెట్‌లో జిపిఆర్‌ఎస్‌ కనెక్షన్‌ ఉన్నా, ఎయిర్‌టెల్‌ లైవ్‌ ద్వారా మెసెంజర్‌ సెట్టింగ్స్‌ డౌన్‌లోడింగ్‌ చేసుకోవాలి. సెట్టింగ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోలేకపోతే ఛాటింగ్‌ చేసుకోవటం కష్టం.
మీ సెల్‌ఫోన్‌ అన్నిరకాలైన సెట్టింగ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సౌలభ్యం కలిగి ఉంటే మాత్రం ఐఎమ్‌ అని టైప్‌చేసి 57070కి ఎస్‌ఎమ్‌ఎస్‌ పంపి సెట్టింగ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఛాటింగ్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ 31 ఆగస్టు వరకు మాత్రమేనని ఎయిర్‌టెల్‌ వెల్లడిస్తోంది. మరింత సమాచారం కోసం ఎయిర్‌టెల్‌ కస్టమర్‌కేర్‌ 121 నుంచి మరింత సమాచారం పొందవచ్చు.

ఆంగ్ల భాషలోను, అను లాంటి యూనీకోడేతర ఫాంట్లను చెయ్యవచ్చు

ఈ ఉపకరణం గురించి:

ఇది Unigateway ప్రాజెక్టులోని కొన్ని ముఖ్య ఫైళ్లను ఉపయోగిస్తూ, మరికొంత సంకేతికత కలిపి తయారు చెయ్యబడింది.

Unigateway అనేది మొజిల్లా Padma ప్లగిన్ నుండి స్ఫూర్తిపొంది PHPలో రాయబడిన ఉపకరణాల సమాహారం. 

 మీ టెక్స్ట్ ఫైలు యూనీకోడులోకి సరిగ్గా మారకపోతే; రెండు కారణాలు ఉండవచ్చు
1) టైపు చేసిన వెర్షను ఒకటి; ఇక్కడ మారుస్తున్నప్పుడు ఎంచుకున్న వెర్షను మరొకటి అయ్యుండొచ్చు
2) అనేతర ఫాంట్లలో టైపు చేసి ఉండొచ్చు

 సాదారణంగా వర్డు, పేజ్‌మేకరు లాంటి సాఫ్ట్‌వేర్‌లలో ఒకటికన్నా ఎక్కువ ఫాంట్లను ఉపయోగించవచ్చు. ఆంగ్ల భాషలోను, అను లాంటి యూనీకోడేతర ప్రొప్రైటరీ ఫాంట్లను ఉపయోగిస్తూ అంగ్లేతర భాషలలోనూ కలిపి ఒకే ఫైలులో టైపు చెయ్యవచ్చు. కానీ నోట్‌పేడ్‌ లాంటి టెక్స్ట్ ఎడిటర్‌లలో ఒక ఫైలులో ఒక్క ఫాంటుని ఉపయోగించి మాత్రమే టైపు చెయ్యగలం. కాబట్టి వర్డు, పేజ్‌మేకరు లలో టైప్ చేసిన టెక్స్ట్‌ని నోట్‌పేడ్‌లోకి కాపీ చేసినట్టయితే, అప్పుడు ఎంచుకున్న ఫాంటులో ఉన్న టెక్స్ట్ మాత్రమే సరిగ్గా కనబడుతుంది. మిగిలిన ఫాంట్లలో ఉన్న అక్షరాలు, ఎంచుకున్న ఫాంటులోకి రూపాంతరం చెంది అర్థం కావు. 


Popular Posts