Ad Code

నవారు మంచం రూ.41వేలు ... !

 


న్యూజిలాండ్‌ లోని అన్నాబెల్లే  బ్రాండ్ నవారు మంచాన్ని భారతీయ ప్రాచీన పగటివేళ పడుకునే మంచం  అనే పేరుతో తన వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టింది. దాని ధరను 800 న్యూజిలాండ్ డాలర్లుగా ఫిక్స్ చేసింది. అంటే మన భారతీయ రూపాయల్లో రూ.41,297. ఇది ఇంత రేటు ఎందుకు మన దేశంలో మహా అయితే రూ.10 వేల లోపే ఉంటుంది కదా అని మనకు అనిపించవచ్చు. ఇలా విమర్శిస్తామని తెలిసే అ కంపెన ఇది ప్రత్యేకమైన మంచం అనీ, ఒరిజినల్ అనీ చెప్పింది. దాని అసలు ధర 1200 న్యూజిలాండ్ డాలర్లు అని చెప్పింది. అంటే మన రూపాయిల్లో రూ.61,980 అన్నమాట. డిస్కౌంట్ పోగా దాని ధర రూ.41,297గా చెప్పింది. నవారు మంచంలో ఏముంటుంది... ఓ దీర్ఘ చతురస్రాకార కలపకు చుట్టూ నాలుగు కాళ్లు, మధ్యలో దారాలతో అల్లి ఉంటుంది. దాన్ని తయారుచేయడం తేలికే. అలాంటి దాన్ని అరుదైనదిగా చెబుతూ అదిరిపోయే రేటుకు అమ్మడం ఆశ్చర్యకరమే. ఈ రోజుల్లో ఇలాంటి మంచాల్ని కొనడమే తగ్గిపోయింది. ఇంతకంటే క్వాలిటీ ఉన్నవి కొంటున్నారు. బెడ్ షీట్లు వేసుకోవడానికి వీలుగా ఉండేలా పెద్ద డబుల్ కాట్ మంచాలు కొనుక్కుంటున్నారు. అందుకే దీన్ని చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఈ మంచం ఫొటో వైరల్ అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu