Search This Blog
Saturday, March 25, 2023
శామ్సంగ్ బ్లూ ఫెస్ట్ 2023 ఈవెంట్ !
Saturday, February 11, 2023
గోడాడీ, యాహూలో లే ఆఫ్స్ !
Monday, April 4, 2022
వాట్సాప్ లో కొత్త నిబంధన ?
Wednesday, October 13, 2021
నవంబర్ 15 నుంచి వర్క్ఫ్రం హోంకు స్వస్తి ?
నవంబర్ 15 నుంచి ఉద్యోగులంతా ఆపీసులకు రావాలని టీసీఎస్ ఆదేశించినట్లు టెక్ వెబ్సైట్ ట్రాక్ ఇన్ ఓ వార్తా కథనం ప్రచురించింది. దీంతో కరోనాను నియంత్రించడానికి గతేడాది అమల్లోకి తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికినట్లైందా.. అన్న సందేహాలు కలుగుతున్నాయి. టీసీఎస్లోని ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సంస్థ హెచ్ఆర్ హెడ్ మిలిండ్ లక్కాడ్ చెప్పారు. రెండు డోస్ల వ్యాక్సిన్లు వేసుకున్న వారు మాత్రమే ఆఫీసులకు రావాలని మిలింద్ లక్కాడ్ చెప్పారని తెలిసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. ప్రస్తుతం 70 శాతానికి పైగా రెండు డోస్లు వేసుకున్నారు. 95 శాతం మంది టీసీఎస్ ఉద్యోగులు సింగిల్ డోస్ వేయించుకున్నారు. అర్హులైన ఉద్యోగులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికం నుంచి 100 శాతం అలవెన్స్లు పొందుతారన్నారు. 2025 నాటికి కేవలం 25 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసులో సేవలందిస్తారని, మిగతా 75 శాతం మందికి వర్క్ ఫ్రం హోం వర్తిస్తుందని ప్రకటించింది. గత కొన్ని వారాలుగా టీసీఎస్ ఉద్యోగుల్లో 80 శాతం మందికి పైగా ఆఫీసులకు వస్తున్నారని సంస్థ ఇంతకుముందు తెలిపింది.
Monday, October 11, 2021
మార్కెట్లోకి వివో వై20టీ
Sunday, September 26, 2021
టోకెనైజేషన్ వ్యవస్థ !
Monday, September 20, 2021
కాంగ్రెస్లోకి కన్నయ్య, జిగ్నేశ్
దిల్లీ లోని జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్, గుజరాత్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. మహాత్మగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న వారిద్దరూ కాంగ్రెస్లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్ 28నే వీరు పార్టీలో చేరాల్సి ఉండగా.. కొంచం ఆలస్యంగా చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాహుల్ గాంధీతో భేటీ అయినప్పుడే కన్నయ్య కుమార్ కాంగ్రెస్లో చేరుతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. సీపీఐలో ఇమడలేకపోవడం ఆయన చేరికకు కారణమని తెలుస్తోంది. ఆయనను బిహార్ పార్టీశాఖకు అధ్యక్షుడిని చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు గుజరాత్ వాద్గాం నియోజకవర్గానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సైతం చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చరణ్జిత్ సింగ్ను ఎంపిక చేయడాన్ని ఆయన స్వాగతించడం ఇందుకు బలం చేకూరింది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేశ్ చేరిక కాంగ్రెస్కు కొంతమేర కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆయనను పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Tuesday, August 31, 2021
నవారు మంచం రూ.41వేలు ... !
Thursday, August 19, 2021
గూగుల్కు మరోసారి భారీ షాక్...!
Wednesday, August 18, 2021
పేటీఎం క్యాష్బ్యాక్ ఆఫర్
గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. సబ్సిడీ కూడా అంతంతమాత్రంగానే వస్తోంది. దీంతో సామాన్యులకు గ్యాస్ సిలిండర్ కొనడం భారం అయిపోయింది. ఇలాంటి టైమ్లో పేటీఎం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేవారికి రూ.900 వరకు క్యాష్బ్యాక్ అందిస్తోంది. ఇలా ఒక్కసారి కాదు... వరుసగా మూడు నెలలు రూ.900 చొప్పున క్యాష్బ్యాక్ అందిస్తోంది. మొత్తం రూ.2700 వరకు క్యాష్బ్యాక్ పొందొచ్చు. '3 పే 2700 క్యాష్బ్యాక్ ఆఫర్' పేరుతో ఈ ఆఫర్ ప్రకటించింది పేటీఎం. ఈ ఆఫర్లో భాగంగా కొత్త యూజర్లు గ్యాస్ సిలిండర్ బుక్ చేసి మూడు నెలల పాటు రూ.900 చొప్పున క్యాష్బ్యాక్ పొందొచ్చు. ఇండేన్ గ్యాస్, హెచ్పీ గ్యాస్, భారత్ గ్యాస్ యూజర్లు ఈ ఆఫర్ పొందొచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి రూ.900 క్యాష్బ్యాక్ పొందడం మాత్రమే కాదు... డబ్బులు లేకపోయినా గ్యాస్ సిలిండర్ బుక్ చేయొచ్చు. తర్వాతి నెలలో గ్యాస్ సిలిండర్ డబ్బులు చెల్లించొచ్చు. పేటీఎం అందిస్తున్న పేటీఎం పోస్ట్పెయిడ్ ఆఫర్ ద్వారా ఇది సాధ్యం. పేటీఎం పోస్ట్పెయిడ్ ద్వారా మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. వచ్చే నెలలో చెల్లిస్తే సరిపోతుంది. ఇక ప్రస్తుత యూజర్లు ప్రతీ బుకింగ్పై 5000 క్యాష్బ్యాక్ పాయింట్స్, రివార్డ్ పొందొచ్చు. వీటిని ప్రముఖ బ్రాండ్స్ అందించే అద్భుతమైన డీల్స్, గిఫ్ట్ వోచర్స్కు రీడీమ్ చేయొచ్చు. ఇక ఇటీవల పేటీఎం సరికొత్త ఫీచర్స్తో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎక్స్పీరియెన్స్ను పెంచింది. యూజర్లు సిలిండర్ బుక్ చేసిన తర్వాత ట్రాకింగ్ కూడా చేయొచ్చు. దీంతోపాటు మీ గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేయాలంటూ పేటీఎం రిమైండర్స్ కూడా పంపిస్తుంది. పేటీఎం యాప్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ముందుగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్లో బుక్ గ్యాస్ సిలెండర్ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ గ్యాస్ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఎల్పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెర్చ్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. ఓసారి వివరాలు కన్ఫామ్ చేసుకొని బుకింగ్ పైన క్లిక్ చేయాలి. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయాలి. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. పేటీఎం పోస్ట్పెయిడ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.
Tuesday, August 17, 2021
బెస్ట్ 5జీ ఫోన్లు
మార్కెట్లో 5జీ టెక్నాలజీ ఫోన్లు వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. వేగవంతమైన పనితీరుతోపాటు కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మెడియాటెక్ న్యూ డైమెన్సిటీ 1200 చిప్తో నడిచే ఫోన్లను జనాలు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. వీటి ధర రూ.30,000 లోపే ఉండడం విశేషం.
షియోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ
- ధర: రూ. 27,499
- బేసిక్ ఫీచర్స్: 6జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ
మెరుగైన ప్రాసెసింగ్ స్పీడ్ షియోమి ఎమ్ఐ 11ఎక్స్ 5జీ మొబైల్ సొంతం. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 870 ఎస్ఓసీతో అందుబాటులో ఉంది. దీనితోపాటు 6జీబీ RAM, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ లభిస్తుంది. ఆకర్షణీయమైన రంగులతోపాటు 6.67 అంగుళాల సూపర్ ఏఎమ్ఓఎల్ఈడీతో ఫుల్ హెచ్డీ డిస్ప్టే ఫోన్ ప్రత్యేకత. అంతే కాకుండా హెచ్డీఆర్10+, 13,000 నిట్స్ లైటింగ్ ఉంటుంది. ఫోన్కి ఉండే 5 పొరల గొరిల్లా గ్లాస్ ఫోన్ పై గీతలు పడకుండా కాపాడుతుంది. ఈ ఫోన్ డిస్ప్లేలో గేమ్స్ ఆడడం మంచి అనుభూతిని ఇస్తుంది. ఫోన్ మందం 8మిమీ కంటే తక్కువ ఉంది. కెమెరా 48 ఎంపీ దీనితో పాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్, 5 ఎంపీ అదనపు కెమెరాలు ఉన్నాయి. 20 ఎంపీతో ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ప్రియులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. బ్యాటరీ 4,520 ఎంఏహెచ్. గంటలో ఫోన్ మొత్తం చార్జ్ అయ్యేలా 33W ఫాస్ట్ ఛార్జర్ ఫోన్తోపాటు వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 పై MIUI 12 తో రన్ అవుతుంది.
రియల్మి ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ
- ధర: రూ. 27,999
- బేసిక్ ఫీచర్స్: 12జీబీ RAM/ 256 జీబీ స్టోరేజీ
అందమైన ఫిన్షింగ్తోపాటు మెరుగైన ఫీచర్తో మార్కెట్లో అందుబాటులో ఉంది . రియల్మి ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ. ఈ ఫోన్లో డైమెన్సిటీ 1200 SoC ని ఉపయోగించారు. 8 జీబీ RAM/ 128 జీబీ మెమోరీ స్టోరేజ్ మోడల్తో పాటు 12 జీబీRAM/256 జీబీ స్టోరేజ్ మోడల్లు ఉన్నాయి. 6.43 అంగుళాలతో ఫుల్ హెచ్డీ ఏఎమ్ఓఎల్ఈడీ డిస్ప్లే 120 హెడ్జ్తో పాటు 1,000 నీట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంది. ఈ ఫోన్లో ట్రిపుల్ సెటప్ కెమెరా ఉంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా కెమెరా, 2 అదనపు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ వీడియోలు, ఫోటోలకు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంహెచ్ఏ, 50 W ఫాస్ట్ చార్జర్ ఫోన్తోపాటు వస్తాయి. ఫోన్ రియల్మీ UI 2.0 తో Android 11 ని ఉపయోగిస్తున్నారు.
వన్ప్లస్ నార్డ్ 2
- ధర: రూ. 29,999
- బేసిక్ ఫీచర్స్: 8జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ
కొత్త 5జీ మోడల్స్లో వన్ప్లస్ నార్డ్ 2 ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. శక్తివంతమైన ప్రాసెసర్ ఫోన్ ప్రత్యేకతల్లో ఒకటి. 6.43 అంగుళాల స్క్రీన్తోపాటు హెచ్డీ+తో పాటు ఏఎమ్ఓఎల్ఈడీ డిస్ప్లే కూడా కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+ డిస్ప్లే కలిగి ఉంది. ఐదు పొరల గొరిల్లా గ్లాస్ ఫోన్కు అదనపు ఆకర్షణను ఇస్తుంది. 8 జీబీ RAMతో 128 జీబీ స్టోరేజ్ మెమోరీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా కొత్త ఆక్సిజన్ ఓఎస్ 11.3 ని వినియోగిస్తున్నారు. 50 MP ప్రధాన కెమెరతో పాటు ఆప్టికల్ ఇమేజ్స్టెబిలైజేషన్ (OIS), సోనీ కొత్త IMX766 సెన్సార్ ఫీచర్ ఫోన్ సొంతం. విభిన్న లైటింగ్లలోనూ మంచి ఫోటోలు పొందేలా రూపొందించారు. ప్రధాన కెమెరాకు సపోర్టుగా 8 MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2 MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 MP ఫ్రంట్ కెమెరా కారణంగా ఎక్కువ మంది సెల్ఫీ ప్రియులు ఈ ఫోన్పై మక్కువ చూపుతున్నారు. వన్ప్లస్ నార్డ్ 2 బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంహెచ్ఏ, అర్ధగంటలో చార్జ్ అయ్యేలా 65 W ఫాస్ట్ ఛార్జర్ ఫోన్తో పాటు పొందవచ్చు.
పోకో ఎఫ్ 3 జీటీ
- ధర: రూ. 28,999
- బేసిక్ ఫీచర్స్: 8జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ
పోకో ఎఫ్ 3 జీటీ డిజైనింగ్ఎక్కువగా గేమర్లను ఆకట్టుకొనేలా ఉంది. ఈ ఫోన్లో ఒక గ్లాస్ బ్యాక్, ఫిజికల్ గేమింగ్ ట్రిగ్గర్స్ (డెడికేటెడ్ గేమింగ్ బటన్స్) తో డిజైన్ను కలిగి ఉంది. ఫోన్ 6.67 అంగుళాల సైజ్తోపాటు హెచ్డీ+ ఏఎమ్ఓఎల్ఈడీ డిస్ప్లే కలిగి ఉంది. ఫోన్ వెనుకభాగానికి గొరిల్లా గ్లాస్తో రక్షణ కల్పించారు. 8 జీబీ RAMతో 128 జీబీ స్టోరేజ్ మెమోరీ కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5,065 ఎంహెచ్ఏ బ్యాటరీ ఉంది. 67 W సోనిక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జర్ కేవలం 45 నిమిషాల్లో బ్యాటరీని మొత్తం చార్జ్ చేయగలదు. ఈ ఫోన్లో ఫోటోగ్రఫీని పట్టించుకోలేదు. 64 MP ప్రైమరీ కెమెరా.. 8 MP అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 2 MP అదనపు కెమెరాను ఇచ్చారు. 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్లో MIUI 12.5 తో Android 11 ని ఉపయోగిస్తున్నారు.
ఒపో రెనో6 5 జి
- ధర: రూ. 29,990
- బేసిక్ ఫీచర్స్: 8జీబీ RAM/ 128 జీబీ స్టోరేజీ
మీడియాటెక్ డైమెన్సిటీ చిప్తో నడిచే ఒపో రెనో6 5జీ కూడా మిగతా మొబైల్స్ లాగా వినియోగదారులు ఇష్టపడే జాబితాలో ఉంది. ఫోన్తో 8జీబీ RAM మరియు 128 జీబీ స్టోరేజ్ లభిస్తాయి. ఈ ఫోన్ ఐఫోన్ 12. షేడ్స్ కలిగి ఉంది. 6.43-అంగుళాలు పరిమాణంలో ఏఎమ్ఓఎల్ఈడీ డిస్ప్లే ,90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు 750 నీట్స్ డిస్ప్లే సామర్థ్యం కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఈ ఫోన్ కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంహెచ్ఏ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. 65W సూపర్వూక్ 2.0 ఫాస్ట్ ఛార్జర్ ఫోన్తో పాటు లభిస్తుంది. ఈ ఫోన్ పోకో ఎఫ్ 3 జీటీ, రియల్మి ఎక్స్ 7 మ్యాక్స్ 5జీ మాదిరిగానే కెమెరా విభాగం ఉంది. 64 MP ప్రైమరీ కెమెరా.. 8 MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2 MP అదనపు కెమెరా లభిస్తుంది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 5G ఫోన్ కలర్ఓఎస్ 11.3 తో ఆండ్రాయిడ్ 11ని వినియోగిస్తున్నారు.
తాలిబన్లకు ఫేస్బుక్ షాక్ !
ఫేస్బుక్ తాలిబన్లపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్లను వినియోగించకుండా నిషేధం విధించింది. తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్పై కూడా ఫేస్బుక్ నిషేధం విధించనుంది. తాలిబన్లకు అనుకూలంగా ఉన్న కంటెంట్, వీడియోలను, పోస్ట్లను తొలగించేందుకు ప్రత్యేకమైన ఆప్ఘన్ నిపుణుల బృందాన్ని ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. తాలిబన్లను యూఎస్ టెర్రరిస్టు సంస్థగా గుర్తించిన్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది.
Thursday, August 5, 2021
పురుషుల హాకీలో కాంస్య పతకం
టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు 5-4 తేడాతో జర్మనీపై విజయం సాధించి కాంస్య పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో ఒలింపిక్స్లో హాకీ పోటీల్లో పతకం కోసం 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడి దేశవ్యాప్తంగా సంబరాలకు తెరలేసింది. ఒలింపిక్స్లో భారత్ సత్తా చాటిన హాకీ క్రీడాకారులకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మ్యాచ్ ఆరంభంలో భారత్పై జర్మనీ పైచేయి సాధించినప్పటికీ.. సిమ్రంజీత్ సింగ్, హార్దిక్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో జర్మనీపై భారత్ విజయం సాధించింది.
Sunday, July 11, 2021
టిక్ టాక్ మోజు ప్రాణం తీసింది !
ఏపీ ఫైబర్ నెట్ స్కామ్పై దర్యాప్తు
ప్రస్తుత ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఫైబర్ నెట్ స్కామ్ పై విచారణ జరపాలని గతంలోనే సీబీఐను జగన్ సర్కార్ కోరింది. విచారణ చేపట్టే అంశంపై సీబీఐ స్పందించకపోవడంతో తాజాగా సీఐడీకి విచారణను అప్పగిస్తూ, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుమారు రూ. 700-1000 కోట్ల మధ్య ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని గతంలోనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లు.. ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగం. టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా అప్పటి టీడీపీ సర్కార్ వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి.
Monday, July 5, 2021
ధరల పెంచిన షావో"మీ"
ఫోన్లో విండోస్ 11 ?
Sunday, July 4, 2021
చైనా వ్యోమగాముల స్పేస్ వాక్
ఇద్దరు చైనా వ్యోమగాములు మొట్టమొదటిసారిగా తమ దేశ కొత్త ఆర్బిటల్ స్టేషన్ బయట స్పేస్ వాక్ చేశారు. 15 మీటర్ల పొడవైన రోబోటిక్ ఆమ్ (చేతిని) అమర్చేందుకు వారు బయట ఈ వాక్ చేయడం విశేషం. ల్యూ బూమింగ్, టాంగ్ హాంగ్ బో అనే వీరు బయట నడుస్తుండగా కక్ష్య లోపల కమాండర్ నీ హైషింగ్ వీరి కదలికలను పర్యవేక్షించాడు. మూడు నెలల మిషన్ కి గాను ఈ ముగ్గురు ఏస్ట్రోనట్స్ గత జూన్ 17 న ఈ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. పాలక కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని చైనా ఈ స్పేస్ మిషన్ ని చేబట్టింది. కొద్దిసేపు శ్రమించిన అనంతరం స్పేస్ వాక్ చేసిన వ్యోమగాములు రోబోటిక్ చేతిని అమర్చగలిగారు. ఈ రోబోటిక్ ఆర్మ్ఆర్బిటల్ స్టేషన్ భాగాలను ఒకటిగా చేయడానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే సుమారు ఆరు గంటల వరకు వాక్ చేయడానికి అనువుగా వీరి సూట్లను డిజైన్ చేశారు. షేంజూ క్యాప్స్యూల్ లో ఈ వ్యోమగాముల మిషన్ సాగింది.
వచ్చే సంవత్సరాంతానికి 70 టన్నుల ఆర్బిటల్ స్టేషన్ కి మరో రెండు మోడ్యూల్స్ ని కలిపేందుకు చైనా స్పేస్ ఏజెన్సీ మొత్తం 11 ప్రయోగాలను చేపట్టాలని ప్రతిపాదించింది. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలపై చైనా అభివృద్ధి పథంలో సాగుతుండగా అమెరికా లోలోపల విమర్శిస్తోంది. చైనా ఈ ప్రయోగాలను అంతరిక్షంలో కూడా తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చేపడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీ మాత్రం ఎడారుల్లో ఏర్పాటు చేసిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాల ద్వారా ఈ విధమైన మిషన్ లను కామ్ గా చేసుకునిపోతోంది.
వర్క్ ఫ్రం హోం కోసం శాటిలైట్ ఆఫీసులు
ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కసరత్తులు చేస్తోంది. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క ఐటీ పార్కు నిర్మించకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో తమ కార్యాలయాలను ప్రారంభించడానికి ముందుకు వస్తున్న సంస్థలు స్పేస్ కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని జగన్ సర్కార్ అభిప్రాయపడుతోంది. విశాఖ, తిరుపతిలో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి అనంతపురం, తిరుపతి, విశాఖలో ఒక్కోచోట వేయి నుంచి రెండు వేల ఎకరాల్లో ఐటీ కాన్సెప్ట్ నగరాలను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇవి అందుబాటులోకి రావడానికి కనీసం రెండేళ్లు పట్టే అవకాశం ఉండడంతో తక్షణం ఐటీ స్పేస్ అందుబాటులోకి తీసుకురావాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఇందుకోసం ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ ఒక పటిష్ట ప్రణాళికను సిద్ధంచేస్తోంది. ఇందులో భాగంగా బిల్డర్లు, రియల్టీ అసోసియేషన్ల సహకారం తీసకోవాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అనువైనవి ఎక్కడెక్కడ ఎంత స్థలం అందుబాటులో ఉందన్న వివరాలతో ఒక ప్రత్యేక పోర్టల్ను ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ అందుబాటులోకి తీసుకురానుంది. ఐటీ పార్కుల అభివృద్ధికి అందుబాటులో ఉన్న స్థలాల వివరాలతో పాటు నిర్మాణం పూర్తిచేసుకున్నవి, నిర్మాణం పూర్తికావస్తున్న భవనాల్లో ఎన్ని చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉందన్న వివరాలను ఈ పోర్టల్లో పొందుపరుస్తారు. ఇందుకోసం స్థానిక బిల్డర్లు, రియల్టీ అసోసియేషన్లతో కలిసి అందుబాటులో ఉన్న భవనాలను ఎంపిక చేస్తారు.
తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం దగ్గర ప్రైవేటు బిల్డర్లు నిర్మిస్తున్న బిల్డింగ్ల వివరాలను ఈ పోర్టల్లో ఉంచనున్నారు. అంతేకాక.. ఈ బిల్డింగ్ల చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులు, స్కూళ్లు, రెస్టారెంట్లు వంటి వాటి వివరాలను కూడా అందులో పేర్కొంటారు. మరో రెండు వారాల్లో బిల్డర్లతో సమావేశం కావడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఐటీ కంపెనీలు, బిల్డర్లకు మధ్యలో ఐటీ ఏజెన్సీ కేవలం అనుసంధానకర్తగా మాత్రమే వ్యవహరిస్తుందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...