దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ మార్కెట్ను క్యాష్ చేసుకునేందుకు ఆటో కంపెనీలు పోటీపోటీగా ఇ-స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. వీటితో పాటు కొత్త స్టార్టప్ సంస్థలు కూడా ఇందులో అడుగుపెడుతున్నాయి. తాజాగా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒకాయా గ్రూప్ ఫ్రీడమ్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధరను రూ. 69,900 గా నిర్ణయించింది. ఒకాయా ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను భారత్లో విక్రయిస్తోంది. అవియోన్ ఐక్యూ సిరీస్, క్లాస్ఐక్యూ సిరీస్ పేర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి. తాజాగా మూడవ ఉత్పత్తిగా విడుదలైన ఫ్రీడమ్ మోడల్ లిథియం అయాన్, లెడ్ యాసిడ్ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది.
250 కిలోమీటర్ల రేంజ్
హిమాచల్ ప్రదేశ్లోని బద్ది తయారీ యూనిట్లో దీన్ని రూపొందించినట్లు ఒకాయా వెల్లడించింది. ఈ కొత్త మోడల్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో లో స్పీడ్, హై స్పీడ్ ట్రిమ్ వేరియంట్లు కూడా ఉంటాయి. ఈ స్కూటర్లు ఒక్కో ఛార్జ్కి గరిష్టంగా 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తాయి. ఈ కొత్త స్కూటర్ లాంచింగ్పై ఒకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా మాట్లాడుతూ " భారత్లో ఎలక్ట్రిక్ మార్కెట్ ఆశాజనకంగా ఉంది. ఈ మార్కెట్ భవిష్యత్తులో మరింత వృద్ధి చెందనుంది. ప్రతి భారతీయుడికి తాము పెట్టిన డబ్బకు అధిక నాణ్యత, విలువను అందించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మేము ఇప్పటికే ఎనర్జీ సొల్యూషన్స్ వ్యాపారంలో ఉన్నందున ఈ-మార్కెట్లో మాకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నాం" అని చెప్పారు.
0 Comments