Xiaomi సంస్థ తన వినియోగదారులకు శుభవార్త. MIUI 13 అప్డేట్ త్వరలో రాబోతోంది. MIUI 13 అప్డేట్ రాబోతోందని Xiaomi వ్యవస్థాపకుడు Lei Jun ధృవీకరించారు. ఈ ఏడాది చివరి నాటికి Xiaomi స్మార్ట్ఫోన్లలో(Smartphone) ఈ అప్డేట్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఏ ఫీచర్లను కలిగి ఉంటుందనే దాని గురించి ఎక్కువ సమాచారం ఇవ్వనప్పటికీ, ఈ అప్ డేట్ వినియోగదాడికి మంచి అనుభూతిని కల్గిస్తుందని తెలుస్తోంది. ఈ అప్ డేట్ తో ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం డిజైన్ మారబోతోందని చర్చలు జరుగుతున్నాయి. ముందుగా ఈ ఆపరేటింగ్ సిస్టం అప్ డేట్ చైనాలో లాంఛ్ అవుతుందని భావిస్తున్నారు. చైనీస్ వెర్షన్ తర్వాత గ్లోబల్ వెర్షన్ మార్కెట్లోకి రానుంది. అటువంటి పరిస్థితిలో, భారతదేశం మరియు గ్లోబల్ వెర్షన్ 2022 లో రానున్నట్లు సమాచారం. ఏ నెలలో ఈ అప్ డేట్ వస్తుందనేది ధృవీకరించబడలేదు. MIUI 12 వేసవిలో విడుదల చేయబడింది. ఈ పరిస్థితిలో జూన్-జూలై నాటికి వచ్చే అవకాశం ఉంది. MIUI 13 రోల్ అవుట్కు ముందు, 12.5 విడుదల చేయబడవచ్చు. Xiaomi తన అనేక స్మార్ట్ఫోన్లలో MIUI 12.5ని అందించాలనుకుంటోంది. తద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచవచ్చు. భారతీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న షియోమి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ను అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. షియోమి తాజాగా తన రెడ్మీ నోట్ 9 మోడల్ను MIUI 12.5 లేటెస్ట్ వెర్షన్తో అప్డేట్ చేసింది. పర్ఫార్మెన్స్, సౌండ్, ఫీచర్ల విషయంలో ఎన్నో కొత్త అప్డేట్లను చేర్చింది. షియోమి నుంచి ఇటీవల లాంచ్ అవుతున్న అన్ని ఫోన్లలో MIUI 12.5 వెర్షన్నే అందిస్తోంది. ఇప్పుడు ఇదే వెర్షన్ను తన పాత స్మార్ట్ఫోన్లలో సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా స్మార్ట్ఫోన్ మరింత వేగంగా రన్ అవుతుంది. కెమెరా, సౌండ్, లుక్ ఇలా అన్ని విషయాల్లోనూ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే షియోమి రెడ్మీ నోట్ 9లో MIUI 12.5 ఎన్హాన్సుడ్ అప్డేట్ను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. షియోమి ఈ ఆగస్టు నుంచి తన స్మార్ట్ఫోన్లలో లేటెస్ట్ అప్డేట్లను అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రెడ్మీ నోట్ 9లో లేటెస్ట్ అప్డేట్ను తీసుకువచ్చింది.
0 Comments