Ad Code

ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు భారీ డిమాండ్


బెంగూళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ అమ్మకాలు భారీగా పెరిగాయి. వార్షికంగా చూస్తే.. ఈ కంపెనీ వాహన అమ్మకాల్లో భారీ పెరుగుదుల నమోదు అయ్యింది. వార్షికంగా డిసెంబర్ నెలలో ఏకంగా 389 శాతం మేర పెరిగింది. 9187 యూనిట్లు నమోదు అయ్యాయి. ఏథర్ ఎనర్జీ డిసెంబర్ నెలలో పలు రకాల ఆఫర్లు తీసుకువచ్చింది. ఫైనాన్స్ ఆప్షన్లు, ఎక్స్చేంజ్ ప్లాన్, జీరో డౌన్ పేమెంట్ ఆఫర్ ఇలా పలు రకాల ప్రయోజనాలు కల్పించింది. దీంతో కంపెనీలు అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. జనాలు ఈ స్కూటర్లను తెగ కొనేస్తున్నారు. అంతేకాకుండా కంపెనీ ఈ కొత్త ఏడాదిలో కూడా అమ్మకాలను పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కంపెనీ ప్రస్తుతం నెలకు 8,000 నుంచి 9,000 వరకు యూనిట్లను నెలకు తయారు చేస్తోంది. ఈ సంఖ్యను 20 వేల యూనిట్లకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. 2023 మార్చి కల్లా ఈ టార్గెట్ చేరుకోవాలని ప్రయత్నిస్తోంది. కంపెనీ గత ఏడాది అక్టోబర్ నెలలో హోసూర్‌లో మరో ప్లాంటును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రొడక్షన్ పెరుగుదలకు ఈ ప్లాంటు చాలా కీలక అంశం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కంపెనీ దేశవ్యాప్తంగా డెలివరీ నెట్‌వర్క్‌ను కూడా పటిష్టం చేసుకోవాలని యోచిస్తోంది. తద్వారా సప్లై చెయిన్ ఒత్తిళ్లను తగ్గించాలని చూస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కొత్త డీలర్ షిప్స్ ఓపెన్ చేయడానికి రెడీ అవుతోంది. ఏథర్ ఎనర్జీ ఎక్స్450, ఏథర్ 450 ప్లస్ పేర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఏథర్ ఎక్స్ 450 ట్రూ రేంజ్ 105 కిలోమీటర్లు. టాప్ స్పీడ్ గంటలకు 90 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలో అందుకుంటుంది. నావిగేషన్ విత్ గూగుల్ మ్యాప్స్, కాల్ నోటిఫికేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ చార్జింగ్‌కు 5 గంటలకు పైనే పడుతుంది. ఈ స్కూటర్ల రేటు రూ.1.35 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రూ.2,500తో ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు.



Post a Comment

0 Comments

Close Menu