Ad Code

అసుస్‌ 200వ స్టోర్‌ ప్రారంభం !


అసుస్‌ ఇండియా న్యూఢిల్లీలో ఆదివారం 200వ స్టోర్‌ను ప్రారంభించింది. దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్‌ నగరానికి చెందిన ఎలక్ట్రానిక్‌ సెంటర్‌ - నెహ్రూ ప్యాలెస్‌ వద్ద ఉంది. ఇది వినియోగదారులకు కన్స్యూమర్‌ పీసీలు, గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లు, ఆల్‌ ఇన్‌ ఒన్‌ డెస్క్‌టాప్‌లు, ఇతర యాక్ససరీలకు చెందిన ప్రతిష్టాత్మక ఆవిష్కరణలను ముందుగా వీక్షించే అవకాశం అందిస్తుంది. అసుస్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌ అర్నాల్డ్‌ సు మాట్లాడుతూ ''భారతదేశంలో మా 200వ స్టోర్‌ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా విస్తరణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్న వేళ ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలుస్తుంది. మాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్‌ ఇండియా. మేము అత్యధిక రద్దీకలిగిన ప్రాంతాలలో మా స్టోర్లను ప్రారంభించనున్నాము. ఈ సంవత్సరం ప్రతి త్రైమాసంలోనూ కనీసం 20 స్టోర్లను జోడించాలనుకుంటున్నాము. తద్వారా మొత్తం స్టోర్ల సంఖ్యను 300కు తీసుకువెళ్లనున్నాము. మేము ఈ క్రమంలో కేవలం అర్బన్‌ మార్కెట్‌లలో మాత్రమే కాకుండా టియర్‌2 ,టియర్‌ 3 నగరాలలో సైతం స్టోర్లను తెరువనున్నాము'' అని అన్నారు. ఈ బ్రాండ్‌ మరిన్ని బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ టచ్‌పాయింట్లను ప్రారంభించడం ద్వారా సమగ్రమైన అనుభవాలను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా చేసుకుంది. అసుస్‌ 2021లో తమ అసుస్‌ ఈ-షాప్‌ ప్రారంభించింది. నేడు దేశవ్యాప్తంగా 200 ఎక్స్‌క్లూజివ్‌ ఔట్‌లెట్లు ఉన్నాయి. అసుస్‌కు 1200 ప్రీమియం కియోస్క్‌లు, 6000 డీలర్‌షిప్‌లు భారతదేశవ్యాప్తంగా ఉన్నాయి. అసుస్‌ ఉత్పత్తులు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌తో పాటుగా మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ ఔట్‌లెట్ల వద్ద కూడా లభ్యమవుతాయి.

Post a Comment

0 Comments

Close Menu