ఆసుస్ జెన్బుక్ సిరీస్ ల్యాప్టాప్స్ లో మరో రెండు మోడళ్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. జెన్బుక్ ఎస్ సిరీస్లో భాగంగా తాజాగా Asus Zenbook S 13 OLED ని తీసుకొచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఓఎల్ఈడీ ల్యాప్టాప్ అని ఆసుస్ వెల్లడించింది. ఈ ల్యాప్ టాప్ కేవలం 1 సెం.మీ మందం మాత్రమే కలిగి ఉందని సంస్థ పేర్కొంది. అదే విధంగా బరువు కూడా 1 కేజీ ఉంటుందని వెల్లడించింది. దీంతో పాటు Zenbook 14 Flip OLED ల్యాప్టాప్ను సైతం దేశీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. Asus Zenbook S 13 OLED (UX5304) ఇప్పటి వరకు అత్యంత స్లిమ్, గ్రీనెస్ట్ జెన్బుక్ అని కంపెనీ ప్రకటించింది. ఈ అత్యాధునిక ల్యాప్టాప్ రెండు రంగుల్లో లభిస్తోంది. బసాల్ట్ గ్రే, పోండర్ బ్లూ రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ఇందులో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ అమర్చారు. 32జీబీ LPDDR5 ర్యామ్, 1టీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 63Wh బ్యాటరీని అందిస్తున్నారు. 16:10 యాస్పెక్ట్ రేషియోలో 13.3 అంగుళాల 2.8K ల్యూమినా OLED స్క్రీన్ వస్తోంది. వైఫై 6E, బ్లూటూత్ 5 కనెక్టివిటీ లాంటి ఫీచర్లు ఈ జెన్ బుక్ లో ఉన్నాయి. 180 డిగ్రీ ఎర్గో లిఫ్ట్ హింజ్ ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో డాల్బీ అట్మోస్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. ఈ అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్ టాప్ ప్రారంభ ధర రూ. 1,04,990 గా కంపెనీ నిర్ణయించింది. Zenbook 14 Flip OLED విండోస్ 11 హోమ్ ఓఎస్పై ఆపరేట్ అవుతుంది. 16:10 యాస్పెక్ట్ రేషియోలో 14 ఇంచుల 2.8K (2,880 x 1,800 pixels) ల్యూమినా OLED టచ్స్క్రీన్ వస్తోంది. Iris Xe Graphics తో 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7- 1360 ప్రాసెసర్ ఇందులో ఉంది. 16 జీబీ ర్యామ్, 512 ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తున్నారు. థండర్బోల్ట్ 4, బ్లూటూత్ 5.2,3.5 ఎంఎం ఆడియో జాక్, వైఫై 6E కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఆసుస్ పెన్ 2.0 స్టైలస్ను కూడా ఇందులో ఇస్తున్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో డాల్బీ అట్మోస్ ఆడియో సిస్టమ్ ఉంటుంది. 65Wh ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 75Whr బ్యాటరీని ఇస్తున్నారు. ఈ ల్యాప్ టాప్ 15.99 MM మందం, 1.5 కిలోల బరువు ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 1,09,990. ఈ ల్యాప్ టాప్ ఫాగీ సిల్వర్, పోండర్ బ్లూ అనే రెండు కలర్స్ లో లభిస్తోంది.
Search This Blog
Showing posts with label ASUS. Show all posts
Showing posts with label ASUS. Show all posts
Friday, April 21, 2023
Tuesday, March 28, 2023
ఏప్రిల్ 13న అసూస్ రోగ్ 7 విడుదల !
దేశీయ మార్కెట్లోకి ఏప్రిల్ 13న అసూస్ సంస్థ అత్యంత శక్తివంతమైన గేమింగ్ స్మార్ట్ఫోన్, అసూస్ రోగ్ 7ని విడుదల చేయనున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. సంస్థ అధికారిక సోషల్ మీడియా ఛానెల్లో సాయంత్రం 5:30 గంటలకి లైవ్ ఈవెంట్ను చూడవచ్చని కంపెనీ వెల్లడించింది. ఫోన్ కి సంబంధించి అసూస్ ఇంకా అధికారిక స్పెసిఫికేషన్లు, డిజైన్ను వెల్లడించలేదు, అయితే ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 SoC ప్రాసెసర్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి, ఇది మెరుగైన దృశ్యమాన అనుభవం కోసం రే ట్రేసింగ్కు మద్దతు ఇస్తుంది. అధికారిక ప్రకటన కంటే ముందుగానే, ROG 7గా భావించే అసూస్ ఫోన్ గీక్బెంచ్లో కనిపించింది. అలాగే, స్మార్ట్ ఫోన్ విభాగంలో లీక్లతో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ట్విట్టర్ వినియోగదారు అభిషేక్ యాదవ్ కూడా కొన్ని లీకులు ద్వారా స్పెసిఫికేషన్లను పంచుకున్నారు. గీక్ బెంచ్ జాబితా ప్రకారం, అసూస్ ఫోన్, ROG 7గా అంచనా వేయబడిన ఈ ఫోన్, 16GB RAM మరియు ఆక్టా-కోర్ SoC ప్రాసెసర్ ని కలిగి ఉంటుంది. ఇది గీక్బెంచ్ పరీక్షలో ఈ ఫోన్ అద్భుతమైన సింగిల్-కోర్ మరియు మల్టీ కోర్ పాయింట్లను పొందింది. ఈ ఫోన్ వరుసగా 1,958 మరియు 5,238 పాయింట్ లను స్కోర్ చేసింది.ఈ ప్రాసెసర్ గరిష్టంగా 3.19GHz గడియారాన్ని కలిగి ఉంది మరియు ఒక ప్రాథమిక కోర్, నాలుగు పనితీరు కోర్లు మరియు మూడు సామర్థ్య కోర్లను కలిగి ఉంటుంది. ROG 6 ఫోన్ 18GB RAM, 256GB నిల్వ మరియు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 SoCతో, 1,289 పాయింట్ల "సింగిల్-కోర్" స్కోర్ మరియు 4,189 "మల్టీ-కోర్" స్కోర్ను స్కోర్ చేసింది. ROG 7 అల్టిమేట్ 512GB వరకు స్టోరేజీ తో వస్తుందని యాదవ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గేమింగ్-సెంట్రిక్ స్మార్ట్ఫోన్లు కెమెరాలు విషయం లో పెద్దగా ఫోకస్ చేయనప్పటికీ, ROG 7 అల్టిమేట్లో 50-మెగాపిక్సెల్ IMX766 కెమెరా సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్ మరియు 8-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉంటాయి. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెన్సార్ ఉండవచ్చు. ఈ ఫోన్ 239 గ్రాముల బరువు మరియు 10.3 మందంతో ఉంటుంది. ఇది దాదాపు గత సంవత్సరం విడుదలైన ROG 6 ప్రో స్మార్ట్ ఫోన్ మాదిరిగానే డిజైన్ ఉంటుంది.
Sunday, March 5, 2023
అసుస్ 200వ స్టోర్ ప్రారంభం !
అసుస్ ఇండియా న్యూఢిల్లీలో ఆదివారం 200వ స్టోర్ను ప్రారంభించింది. దాదాపు 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ నగరానికి చెందిన ఎలక్ట్రానిక్ సెంటర్ - నెహ్రూ ప్యాలెస్ వద్ద ఉంది. ఇది వినియోగదారులకు కన్స్యూమర్ పీసీలు, గేమింగ్ ల్యాప్టాప్లు, ఆల్ ఇన్ ఒన్ డెస్క్టాప్లు, ఇతర యాక్ససరీలకు చెందిన ప్రతిష్టాత్మక ఆవిష్కరణలను ముందుగా వీక్షించే అవకాశం అందిస్తుంది. అసుస్ ఇండియా బిజినెస్ హెడ్, కన్స్యూమర్ అండ్ గేమింగ్ పీసీ, సిస్టమ్ బిజినెస్ గ్రూప్ అర్నాల్డ్ సు మాట్లాడుతూ ''భారతదేశంలో మా 200వ స్టోర్ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా విస్తరణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్న వేళ ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలుస్తుంది. మాకు అత్యంత ముఖ్యమైన మార్కెట్ ఇండియా. మేము అత్యధిక రద్దీకలిగిన ప్రాంతాలలో మా స్టోర్లను ప్రారంభించనున్నాము. ఈ సంవత్సరం ప్రతి త్రైమాసంలోనూ కనీసం 20 స్టోర్లను జోడించాలనుకుంటున్నాము. తద్వారా మొత్తం స్టోర్ల సంఖ్యను 300కు తీసుకువెళ్లనున్నాము. మేము ఈ క్రమంలో కేవలం అర్బన్ మార్కెట్లలో మాత్రమే కాకుండా టియర్2 ,టియర్ 3 నగరాలలో సైతం స్టోర్లను తెరువనున్నాము'' అని అన్నారు. ఈ బ్రాండ్ మరిన్ని బ్రిక్ అండ్ మోర్టార్ టచ్పాయింట్లను ప్రారంభించడం ద్వారా సమగ్రమైన అనుభవాలను వినియోగదారులకు అందించడం లక్ష్యంగా చేసుకుంది. అసుస్ 2021లో తమ అసుస్ ఈ-షాప్ ప్రారంభించింది. నేడు దేశవ్యాప్తంగా 200 ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు ఉన్నాయి. అసుస్కు 1200 ప్రీమియం కియోస్క్లు, 6000 డీలర్షిప్లు భారతదేశవ్యాప్తంగా ఉన్నాయి. అసుస్ ఉత్పత్తులు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్తో పాటుగా మల్టీ బ్రాండ్ రిటైల్ ఔట్లెట్ల వద్ద కూడా లభ్యమవుతాయి.
Thursday, November 24, 2022
అసూస్ నుంచి కొత్త ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు !
దేశీయ మార్కెట్లోకి Asus A3 సిరీస్ క్రింద రెండు కొత్త డెస్క్టాప్ కంప్యూటర్ లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ లైనప్లో Asus A3402 మరియు A3202 మోడల్ డెస్క్టాప్ కంప్యూటర్లు ఉన్నాయి. మరియు ఇవి రెండూ 12వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్ల ద్వారా పనిచేస్తాయి. వీటిలో, A3402 మరింత ప్రీమియం, మరియు ఇది 23.8-అంగుళాల పూర్తి-HD డిస్ప్లేతో వస్తుంది, అయితే ఆసుస్ A3202 మోడల్ 21.45-అంగుళాల స్క్రీన్ను కలిగి ఉంది. ఈ రెండు PC ల యొక్క గ్రాఫిక్స్ Intel Iris Xe GPU ద్వారా పని చేస్తుంది. Asus A3 సిరీస్ కలిగి ఉన్న రెండు మోడల్ లు A3202 మరియు A3402 డెస్క్టాప్ల ధరలు పరిశీలిస్తే, Asus e-shops ఆఫ్లైన్ స్టోర్లలో వరుసగా రూ. 54,990 మరియు రూ. 65,990 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కస్టమర్లు ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా ఈ PC లను కొనుగోలు చేయవచ్చు. ఈ PC 23.8-అంగుళాల పూర్తి-HD (1920x1080) IPS LCD డిస్ప్లే 100 శాతం మరియు 250నిట్లతో వస్తుంది. దీని డిస్ప్లే యాంటీ-గ్లేర్ కోటింగ్ను కలిగి ఉంది మరియు కస్టమర్లు టచ్-సపోర్ట్ వేరియంట్ ని కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంది. ఆల్-ఇన్-వన్ డెస్క్టాప్లో 720p వెబ్క్యామ్ కూడా ఉంది మరియు కనెక్టివిటీ ఎంపికలలో మూడు USB 3.2 Gen 1 టైప్-A, సింగిల్ USB 3.2 Gen 1 Type-C, సింగిల్ USB 2.0 టైప్-A, గిగాబిట్ ఈథర్నెట్ పోర్ట్ ఉన్నాయి ఇంకా రెండు HDMI పోర్టులు కూడా కలిగి ఉంది. అదేవిధంగా రెండవ మోడల్ అయిన A3202, పూర్తిగా 100 శాతం sRGB 100 మరియు 250 nits ప్రకాశంతో చిన్న 21.45-inch Full-HD (1920x1080) IPS LCD డిస్ప్లేతో వచ్చినప్పటికీ, Asus A3202 ఎక్కువ లేదా తక్కువ సారూప్య వివరణలతో వస్తుంది. ఈ PC 12వ తరం ఇంటెల్ కోర్ i5-1235G7/ 12వ తరం ఇంటెల్ కోర్ i3-1215G7 CPUల ద్వారా శక్తిని పొందుతుంది. Asus A3202 లోని కనెక్టివిటీ ఎంపికలు మరియు స్పీకర్ సిస్టమ్ మొదటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.ఈ A3202 మోడల్ కంప్యూటర్ 4.48 కిలోలు బరువు కలిగిఉంది. A3402 PC యొక్క 5.40 kg ల కంటే ఇది తేలికైనది.
Monday, October 24, 2022
అసుస్ జెన్ ఫోన్ 9 విడుదల !
అసుస్ జెన్ఫోన్ 9 స్మార్ట్ ఫోన్ ఇటీవలే గ్లోబల్ లాంచ్ అయింది. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుంది. యాపిల్ తరహాలో చిన్న డిజైన్తో రానున్న ఈ ఫోన్ కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడే వారిని ఆకట్టుకోనుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్పై పని చేయనుంది. దీనికి మనదేశంలో అసుస్ 9జెడ్ అని పేరు పెట్టనున్నారు. అసుస్ జెన్ ఫోన్ 9 ధర యూరోప్లో 799 యూరోల (మనదేశ కరెన్సీలో సుమారు రూ.64,800) నుంచి ప్రారంభం అయింది. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. మిడ్నైట్ బ్లాక్, మూన్లైట్ వైట్, సన్సెట్ రెడ్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో కూడా దీని ధర రూ.70 వేల రేంజ్లో ఉండవచ్చు. ఈ ఫోన్ యూరోప్ వేరియంట్ తరహాలోనే మనదేశంలో కూడా దీని ఫీచర్లు ఉండనున్నాయి. దీని యూరోప్ వేరియంట్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 5.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. స్క్రీన్ యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, పీక్ బ్రైట్నెస్ 1100 నిట్స్గా ఉంది. హెచ్డీఆర్10, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా అందించారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్పై ఈ ఫోన్ పనిచేయనుంది. అడ్రెనో 730 జీపీయూని కూడా ఈ ప్రాసెసర్కు ఇంటిగ్రేట్ చేశారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్గా ఉంది. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సిక్స్-యాక్సిస్ గింబల్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, నావిక్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఐపీ68 రేటింగ్ కూడా ఈ ఫోన్లో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా, 30W ఫాస్ట్ చార్జింగ్ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 18.5 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను, 8 గంటల గేమింగ్ టైంను ఇది అందించనుంది. డ్యూయల్ మైక్రో ఫోన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 169 గ్రాములుగా ఉంది.
Sunday, July 3, 2022
జులై 5న ఆసుస్ రోగ్ ఫోన్ 6 ఫోన్ విడుదల
గేమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఆసుస్ రోగ్ ఫోన్ 6 ఈనెల 5వ తేదీన దేశీయ మార్కెట్లోకి రానున్నది. ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున ఆసుస్ రోగ్ ఫోన్ 6 విడుదల కానుంది. ఆసుస్ అఫీషియల్ యూట్యూబ్ చానెల్లో లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. క్వాల్కామ్ అధునాతన పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ఆసుస్ రోగ్ ఫోన్ 6లో ఉంటుంది. ఈ ప్రాసెసర్తో భారత్లో లాంచ్ కానున్న తొలి మొబైల్ ఇదే. ఆసుస్ రోగ్ ఫోన్ 6కు సంబంధించిన మరికొన్ని స్పెసిఫికేషన్లు కూడా బయటికి వచ్చాయి. ఆసుస్ అధికారిక యూట్యూబ్ చానెల్లో ఈ ఈవెంట్ను లైవ్లో చూడవచ్చు. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ లో ఇప్పటికే ఆసుస్ ఫోన్ లిస్ట్ అయింది. స్నాప్డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్పై ఆసుస్ రోగ్ ఫోన్ 6 రన్ అవుతుందని కూడా ఆ సంస్థ ధ్రువీకరించింది. ఈ ఫోన్కి సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో డిజైన్తో పాటు మరికొన్ని స్పెసిఫికేషన్లు తెలుస్తున్నాయి. వెనుక మూడు కెమెరాల సెటప్తో ఈ మొబైల్ రానుంది. బ్యాక్ ప్యానెల్పై ROG లోగో కనిపిస్తోంది. అలాగే చైనీస్ గేమింగ్ కంపెనీ టెన్సెంట్తో ఈ మొబైల్ కోసం ఆసుస్ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. అందుకే బ్యాక్ ప్యానెల్పై టెన్సెంట్ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ ఎడమ పక్క వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉంటాయని తెలుస్తోంది. 165Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.78 ఇంచుల AMOLED డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుందని తెలుస్తోంది. 6000mAh బ్యాటరీ ఈ ఫోన్లో ఉండనుండగా.. 65వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుందని సమాచారం. వెనుక మూడు కెమెరా సెటప్లో ప్రధాన సెన్సార్ 64 మెగాపిక్సెల్గా ఉంటుందని లీక్ల ద్వారా వెల్లడైంది. ఈ ఫోన్కు 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుందని తెలుస్తోంది. గరిష్ఠంగా 18జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్గా ఉండొచ్చు.
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...