ఉత్తర ప్రదేశ్ లోని మీరట్కు చెందిన ప్రవీణ్ కుమార్ మిట్టల్ అనే వినియోగదారుడు.. గురుగ్రామ్లోని పోర్షే నుండి కారును కొనుగోలు చేశాడు. 2013లో తయారు చేసిన పోర్షే కారు 2014లో తయారు చేసిన కారుగా విక్రయించారని, మోసం చేశారంటూ వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా సర్వీసులో లోపం ఉన్నట్లు పేర్కొన్నాడు. తయారు చేసిన సంవత్సరం గురించి అబద్ధం చెబుతూ రూ. 80 లక్షలకు కేయాన్ను విక్రయించినట్లు కస్టమర్ ఆరోపించారు. అయితే అదే తరహాలో కొత్త కారు ఇవ్వాలని, తాను ఖర్చు చేసిన ఇతర ఖర్చులతో పాటు పూర్తి కారు ధరలను తిరిగి చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. జస్టిస్ రామ్ సూరత్ రామ్ మౌర్య, డాక్టర్ ఇందర్ జిత్ సింగ్లతో కూడిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సంస్థ సేవలో లోపాలున్నాయని, అన్యాయమైన వాణిజ్య పద్ధతిని అనుసరించిందని గుర్తించింది కోర్టు. అతనికి రూ.18 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని పోర్షే సంస్థను ఆదేశించింది.
0 Comments