Ad Code

ఛార్ ధామ్ లో జియో 5జీ సర్వీసులు ప్రారంభం !


ఉత్తరాఖండ్ లోని ఛార్ ధామ్ ఆలయాల్లోనూ 5 జీ సేవలను ప్రారంభించింది. బద్రీనాధ్, కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయ ప్రాంగణాల్లో జియో ట్రూ 5 జీ సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీంతో దేశంలో 3,089 నగరాలు, పట్టణాలకు తమ 5 జీ సేవలను విస్తరించామిన సంస్థ వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు తమ నెట్ వర్క్ సేవలను తీసుకురానున్నట్టు జియో తెలిపింది. జియో ట్రూ 5 జీ వెల్ కమ్ ఆఫర్లో భాగంగా యూజర్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1 GBPS వేగంతో అన్ లిమిటెడ్ టేటాను పొందొచ్చని పేర్కొంది. మరో వైపు 5జీ సేవల విషయంలో రిలయన్స్‌ జియో పోటీదారు అయిన ఎయిర్‌టెల్‌ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరింప చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 3 వేల నగరాలు, పట్టణాల్లో 5జీ ప్లస్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు ఎయిర్‌టెల్‌ వెల్లడించింది. 2023 సెప్టెంబరులోగా ప్రతి ఎయిర్‌టెల్‌ యూజర్లకు 5జీ సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. అందులో భాగంగానే రోజుకు 30 నుంచి 40 నగరాలు/పట్టణాలకు తన 5జీ సేవలను విస్తరిస్తున్నట్టు పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu