టయోటా కిర్లోస్కర్ మోటర్ నుంచి వస్తున్న నూతన ఇన్నోవా క్రిస్టా జెడ్ఎక్స్, వీఎక్స్ ధరలను ప్రకటించింది. ఈ వాహనం మెరుగైన ఫ్రంట్ ఫేసిమా కలిగి ఉంటుంది. దీనిని కఠినమైన, ధృడమైన ప్రదర్శన కోసం నిర్థిష్టమైన ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. తద్వారా భారతీయ కుటుంబాలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్ అవసరాలు తీరుస్తుంది. తమ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక ఎంపీవీ అగ్రగామిగా 2005లో మార్కెట్లో విడుదలైన నాటి నుంచి నిలువడంతో పాటుగా ఇప్పటి వరకూ ఒక మిలియన్కు పైగా యూనిట్లు విక్రయించబడ్డాయి. ఈ వాహనాన్ని ఈ సంవత్సరారంభంలో విడుదల చేసిన నాటి నుంచి ముందస్తు బుకింగ్స్ పరంగా అపూర్వ స్పందన అందుకుంది. ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటర్ సేల్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అతుల్ సూద్ మాట్లాడుతూ ''నూతన ఇన్నోవా క్రిస్టల్ డీజిల్ టాప్ టూ గ్రేడ్ ధరలను వెల్లడించేందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ వాహనాన్ని వినియోగదారులు అన్ని నూతన వేరియంట్లలోనూ ఆదరిస్తున్నారు. దీని యొక్క కఠినమైన, ధృడమైన ముందు భాగం, శైలి, సౌకర్యం, పనితీరు యొక్క ఖచ్చితమైన సమ్మేళనంతో నూతన ఇన్నోవా క్రిస్టా ఖచ్చితంగా ఇన్నోవా వారసత్వంను ముందుకు తీసుకువెళ్లనుంది. ఈ వాహనంలో అత్యాధునిక భద్రతా ఫీచర్లు ప్రయాణీకులకు అత్యున్నత భద్రతను అందించనున్నాయి. ఈ వాహనం అందించే మెరుగైన డ్రైవింగ్ అనుభవాలను మా వినియోగదారులు ఆస్వాదించడంతో పాటుగా ప్రశంసించగలరనే నమ్మకంతో ఉన్నాము'' అని అన్నారు.
0 Comments