Ad Code

హైదరాబాద్​లో గ్లోబల్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్ దజో ఏర్పాటు


గ్లోబల్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్ దజో భారతదేశంలో తన మొదటి డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్​లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దజో గ్రూప్ సీఈఓ షే సెగేవ్ మాట్లాడుతూ రూ.200 కోట్ల ప్రారంభ పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలలో హైదరాబాద్​లో సుమారు రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెడతామని వెల్లడించారు. ఈ సంవత్సరం చివరి నాటికి, ఉద్యోగుల సంఖ్యను వెయ్యికి పెంచుతామని, 2024 డిసెంబరు నాటికి ఉద్యోగుల సంఖ్య 2500కి పెరుగుతుందన్నారు. దజో గ్రూప్ ఐదు కేంద్రాల్లో 3,000 మంది పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 మార్కెట్లలో నంబర్​వన్​ అయిన ఈ కంపెనీ యునైటెడ్ కింగ్‌డమ్​తోపాటు ఇతర మార్కెట్‌లలో ఐపీఎల్ ప్రసార హక్కులను పొందింది. స్ట్రీమింగ్ యాప్‌తో పాటు, దజో ఇంటరాక్టివ్ యాప్‌ను కూడా రూపొందిస్తున్నామని, వివిధ స్పోర్ట్స్​ ఈవెంట్‌లకు టిక్కెట్లు, మెర్చండైజ్ ​ కొనుగోలు చేయవచ్చని, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడవచ్చని సీఈఓ వివరించారు. దజో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సందీప్ టికు మాట్లాడుతూ హైదరాబాద్​ డెవలప్‌మెంట్ సెంటర్, యాప్ డెవలప్‌మెంట్, ఇంటరాక్టివ్ ఎక్స్​పీరియెన్సెస్​, డేటా అనలిటిక్స్​పై పోకస్​ చేస్తుందని అన్నారు. 

Post a Comment

0 Comments

Close Menu