Ad Code

మహిళా టెక్కీకి కోటిన్నర కుచ్చుటోపీ !


హైదరాబాద్ లో ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టులకు రేటింగ్ ఇస్తామని చెప్పి మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నుంచి సుమారు కోటి యాబై లక్షల రూపాయలను దుండగులు వసూలు స్వాహా చేశారు. తాను మోసపోయినట్టుగా భావించిన టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో టెక్కీకి పరిచయమైన నిందితులు తాము సూచించిన ఇన్ స్టా పేజీలకు రివ్యూ రేటింగ్ లు ఇవ్వాలని తెలిపింది.. అలా చేయడం వల్ల కమీషన్ ను కూడా చెల్లిస్తామని నిందితులు తెలిపారు. దీంతో మహిళ టెక్కీ ఇన్ స్టాగ్రామ్ పేజీలకు రివ్యూ రేటింగ్ లు ఇచ్చింది. అయితే ఆ తర్వాత పెట్టుబడి స్కీం పేరుతో నిందితులు సాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి డబ్బులు కాజేశారు. టెక్కీ దగ్గర నుంచి రూ. 1.50 కోట్లను సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. అయినా కూడా మహిళా టెక్కీకి డబ్బులు రాలేదు. దీంతో తాను మోసోపోయినట్టుగా గ్రహించిన సదరు మహిళా టెక్కీ పోలీసులకు ఆశ్రయించింది. దీంతో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu