టెక్నాలజీ రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. ముఖ్యంగా టెక్ గ్యాడ్జెట్స్లో రోజుకో కొత్త ప్రొడక్ట్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మొన్నటి వరకు స్మార్ట్ వాచ్ల ట్రెండ్ బాగా నడించింది. మార్కెట్లో రకరకాల వాచ్లు సందడి చేస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు స్మార్ట్ రింగ్ల హడావుడి మొదలైంది. వేలుకు రింగ్ పెట్టుకుంటే చాలు మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ ఫోన్లో రికార్డ్ చేసుకోవచ్చు. మొన్నటి మొన్న బోట్ తొలి స్మార్ట్ రింగ్ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో టెక్ దిగ్గజం నాయిస్ కూడా స్మార్ట్ రింగ్ను తీసుకొచ్చింది. లూనా పేరుతో ఈ స్మార్ట్ రింగ్ను లాంచ్ చేశారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ను కంపెనీ ప్రారంభంచింది. కంపెనీ వెబ్సైట్ ద్వారా రూ. 2000 చెల్లించి రింగ్ను బుక్ చేసుకోవచ్చు. కొనుగోలు సమయంలో రూ. 1000 డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక ఈ స్మార్ట్ రింగ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ను అందించారు. టైటానియం బాడీతో డిజైన్ చేసిన ఈ స్మార్ట్ రింగ్ 3 మిమీ మందంతో వస్తుంది. ఇక ఈ రింగ్ బాడీ టెంపరేచర్ను ఎప్పటికప్పడు ట్రాకింగ్ చేస్తుంది. దీంతో పాటు ఎస్పీఓ2, స్లీపింగ్ ట్రాకింగ్, నాయిస్ ఫిట్ యాప్కు కనెక్ట్ చేసుకొని యాక్టివిటీ రికార్డ్లు, హెల్త్ డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఇది బ్లూటూత్ లో-ఎనర్జీ (BLE 5) ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ ఐఓఎస్ 14, ఆండ్రాయిడ్ 6 అంతకంటే ఎక్కువ వెర్షన్ డివైజలకు కనెక్ట్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. https://t.me/offerbazaramzon
0 Comments