మానవుడి భూమి కాలుమోపిన కాలం ఆధారంగా నాలుగు సమూహాలుగా విభజించారు. అందులో 100 సంవత్సరాల కిత్రం వరకు ఒక సమూహం, 5,000 సంవత్సరాల క్రితం వరకు ఒక సమూహం, 10,000 సంవత్సరాల క్రితం వరకు ఇంకో సమూహం, 15,000 సంవత్సరాల క్రితం వరకు మరో సమూహంగా విభజించారు. అదృష్టవశాత్తు భూమి చరిత్రలో వివిధ స్థాయిల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా ఉండేవో మనకు కచ్చితమైన కొలతలు ఉన్నాయి. ఈ కొలతలను ఆధారంగా చేసుకుని మనిషి మెదడు పరిమాణాన్ని పోల్చిచూస్తే వాతావరణం వేడెక్కుతున్నప్పుడు అంటే హోలోసీన్ కాలంలో (సుమారు 11,700 సంవత్సరాల క్రితం నుంచి ప్రస్తుత సమయం వరకు) మన పుర్రె సైజు 10 శాతం తగ్గిపోయింది. అంటే అంతకుముందు భూతాపం తక్కువగా ఉన్న సమయంలో మన పూర్వీకులు పెద్ద మెదడులను కలిగి ఉన్నారు. అయితే, మెదడు పరిమాణంలో మార్పులు వాతావరణ మార్పులు జరిగిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలకు సంభవిస్తున్నట్లు పరిశోధనా పత్రంలో వివరించారు. ఈ అన్వేషణలో తేలిన మరో అంశం ఏమిటంటే మానవ పరిణామం అనేది 17 వేల ఏండ్ల క్రితం నుంచి 5 వేల ఏండ్ల క్రితం వరకు వేగంగా జరిగింది. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ అనేది మనిషి మెదడు పరిమాణంలో వృద్ధినే కాకుండా, భవిష్యత్తుల్లో మనిషి జ్ఞానంపై కూడా ప్రభావం చూపుతుందని పరిశోధకురాలు స్టిబెల్ భావిస్తున్నారు. ఇక మానవ శరీరధర్మ శాస్త్రంపై వాతావరణ మార్పు ప్రభావం అనేది ప్రత్యేకంగా ఉష్ణోగ్రత మార్పుల ఫలితమా లేదంటే మారుతున్న వాతావరణంలోని ఇతర అంశాల పరోక్ష ప్రభావమా..? అని నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరమని రిసెర్చ్ పేపర్లో పేర్కొన్నారు. https://t.me/offerbazaramzon
0 Comments