Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Saturday, July 1, 2023

చైనా కంపెనీలకు పోటీగా రూ.ఐదు వేలలోపు స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్న ఇండియన్ కంపెనీలు !


చైనా మొబైల్ ఫోన్ కంపెనీలకు మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్ గట్టి పోటీని ఇచ్చేందుకు దేశీయ కంపెనీలు కొత్త వ్యూహాన్ని రచించాయి. రూ. 5000 కంటే తక్కువ బడ్జెట్లో శక్తివంతమైన స్మార్ట్ ఫోన్లను అందించడం ద్వారా కంపెనీలు మార్కెట్లో తిరిగి సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. స్వదేశీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ రూ. 5,000 రూపాయల రేంజ్ లో త్వరలో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది. అలాగే లావా రూ. 10,000 కంటే తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకురావడానికి రెడీ అవుతుంది. అయితే చైనీస్ బ్రాండ్లు రెడ్ మీ, రియల్ మీ, ఇన్ఫీనిక్స్ గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో సగానికి పైగా చైనా కంపెనీలు ఆక్రమించాయి. కార్బన్ తన 4జీ స్మార్ట్ఫోన్ను రూ. 4,999 ధరకు త్వరలో విడుదల చేయనుందని తెలుస్తోంది. దీంతోపాటు మైక్రోమ్యాక్స్ రూ.5,999కే 4జీ స్మార్ట్ ఫోన్ ను అందించనుంది. లావా గత సంవత్సరం బ్లేజ్ 5జీ, బ్లేజ్ 2 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. దీని ధర రూ. 10,000 కంటే తక్కువ. స్వదేశీ సంస్థ లావా జూన్లో రూ.21,999 ధరతో లావా అగ్ని 2ని పరిచయం చేసింది. స్టాటిస్టా లెక్కల ప్రకారం 2023లో స్మార్ట్ఫోన్ మార్కెట్ ఆదాయం 41.73 బిలియన్ యూఎస్ డాలర్లు. మార్కెట్ వార్షికంగా 7.20% (CAGR 2023-2028) వద్ద వృద్ధి చెందుతుందని అంచనా. గ్లోబల్తో పోల్చితే చైనాలో అత్యధిక ఆదాయం సమకూరుతోంది. 2023లో ఇప్పటివరకు ఇది 119.20 బిలియన్ డాలర్లుగా నమోదైంది. స్మార్ట్ఫోన్ మార్కెట్లో 2028 నాటికి ఉపయోగించే యూనిట్ల సంఖ్య 234.50 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. స్మార్ట్ఫోన్ మార్కెట్ 2024లో 5.9 శాతం వాల్యూమ్ వృద్ధిని చూపుతుందని అంచనా.  https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts