Ad Code

బీవైడీ దరఖాస్తును తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం


చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ ఇప్పటికే తన కార్లను ఇండియాలో విక్రయిస్తోంది. అలాగే మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిసి ఎలక్ట్రిక్ బస్సుల తయారీలోనూ ఉంది. ఈ క్రమంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీకి 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని చైనా బీవైడీ గత వారం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనికి బీవైడీ, ప్రసిద్ధ హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంయుక్తంగా పెట్టుబడి నాయకత్వం వహించాయి. అయితే ఈ పెట్టుబడి దరఖాస్తును అంగీకరించలేమంటూ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. హైదరాబాద్‌లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య శాఖకు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనను కంపెనీలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధానంగా భద్రతా భయాలే కారణంగా ఉన్నట్లు కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు. నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి మెగా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.10,000 నుంచి రూ.15,000 కోట్లను పెట్టుబడి పెట్టబోతోంది. దీనికి చైనాకు చెందిన BYD అన్ని రకాల సాంకేతిక సహాయం, సాంకేతిక మౌలిక సదుపాయాలను అందించాలని నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఈ మెగా పెట్టుబడి వెనక్కి వెళ్లింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu